Breaking
Sat. Jun 28th, 2025

Accident : ఘోర రోడ్డు ప్ర‌మాదం.. నుజ్జునుజ్జైన కారు.. అక్క‌డిక‌క్క‌డే ఏడుగురు మృతి

Mathura Accident: Seven killed in road accident in Mathura, Uttar Pradesh

ద‌ర్వాజ‌-ల‌క్నో

Car Crash On Yamuna Expressway: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. మ‌ధుర‌లోని య‌మునా ఎక్స్‌ప్రెస్‌ వేపై (Yamuna Expressway) పై వెగంగా వ‌స్తున్న రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్ర‌మాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో ఏడుగురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. చనిపోయిన వారిలో ముగ్గురు మ‌హిళ‌లు, మ‌రో ముగ్గురు పురుషులు, ఓ చిన్నారి ఉన్నారు.

ఈ ప్ర‌మాదంలో చ‌నిపోయిన వారు ఒకే కుటుంబానికి చెందినవార‌నీ, పెండ్లికి హాజరైన తర్వాత హర్దోయ్ నుండి నోయిడాకు తిరిగి వస్తుండ‌గా.. తెల్లవారుజామున 5 గంటల సమయంలో వారి కారు గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్ర‌మాదంలో ఏడుగురు అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోగా.. తీవ్రంగా గాయ‌ప‌డ్డ ఇద్ద‌రు వ్యక్తులు ఆస్పత్రి చికిత్స పొందుతున్నార‌ని తెలిపారు.

ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని మోడీ, ఉత్త‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగీ ఆదిత్యానాథ్ లు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

Related Post