Breaking
Sat. Jun 28th, 2025

Indian soldiers: నదిలో ప‌డిన బ‌స్సు.. ఏడుగురు భారత సైనికులు మృతి

7 soldiers killed, vehicle falls, Shyok river, Ladakh, Indian soldiers , Indian Army, Siachen, Indian Army soldiers , 7 మంది సైనికులు మృతి, వాహనం, ష్యోక్ నది, లడఖ్, భారత సైనికులు, ఇండియన్ ఆర్మీ, సియాచిన్, ఇండియన్ ఆర్మీ సైనికులు, Ladakh, India, Shyok River, Accident, Turtuk, soldie

దర్వాజ-లడఖ్

Shyok River • Accident • Turtuk : లడఖ్‌లో 26 మంది భారతీయ ఆర్మీ సైనికులతో వెళ్తున్న బస్సు ప్ర‌మాద‌వ‌శాత్తు ష్యోక్ నదిలో పడిపోయింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో కనీసం 7 మంది భార‌త సైనికులు మరణించారు. శుక్రవారం నాడు సైనికులు ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి ష్యోక్ నదిలో పడిపోవడంతో ప్రాణాలు ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయార‌ని అధికారులు తెలిపారు. ఈ వాహ‌నంలో మొత్తం 26 మంది సైనికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో 19 మంది సైనికులకు తీవ్ర గాయాలైనట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.

ప్రమాదం జరిగినప్పుడు బస్సులో మొత్తం 26 మంది సైనికులు ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌లో గాయపడిన సైనికుల‌కు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రయత్నాలు జ‌రుగుతున్నాయ‌నీ, గాయపడిన 19 మంది సైనికులను ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సి-17 గ్లోబ్‌మాస్టర్ విమానం ద్వారా హర్యానాలోని పంచకులలోని చండీమందిర్ కమాండ్ ఆసుపత్రికి తరలించినట్లు సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఉదయం 9 గంటలకు, థోయిస్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో, బస్సు 50 నుండి 60 అడుగుల ష్యోక్ నదిలో పడిపోయింది. బస్సులో ఉన్న సైనికులందరికీ గాయాలయ్యాయి. ఘ‌ట‌న గురించి స‌మాచారం అందుకున్న వెంట‌నే అధికారులు వేగంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు.

కాగా, ఉత్తర కాశ్మీర్‌లో ఉన్న సియాచిన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమిగా గుర్తింపు ఉంది. ఇక్క‌డ 1984 ఏప్రిల్ 3 నుంచి 20,000 అడుగుల ఎత్తులో భారత సైనికులను అక్కడ మోహరించారు.

Related Post