దర్వాజ-అంతర్జాతీయం
missing Nepal plane: నేపాల్ ఎయిర్లైన్స్ విమానంలోని భారతీయ కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులతో సహా 22 మంది వ్యక్తుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకంటే ప్రతికూల వాతావరణం, మేఘాల కమ్మేయడంతో సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ నిలిచిపోయింది. హిమాలయ దేశమైన నేపాల్ లోని పర్వత ప్రాంతంలో ఆదివారం అదృశ్యమైన విమానాన్ని గుర్తించడం కష్టతరం చేసింది. పర్యాటక నగరం పోఖారా నుండి బయలుదేరిన తర్వాత విమానంతో సిగ్నల్ కట్ అయ్యాయని అధికారులు తెలిపారు. ఖాట్మండుకు తూర్పున 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోఖారా నుంచి ఉదయం 10:15 గంటలకు బయలుదేరిన తారా ఎయిర్కు చెందిన విమానం పరిస్థితి ఇప్పటి వరకు తెలియలేదని నేపాల్ ఒక ప్రకటనలో తెలిపింది.
టర్బోప్రాప్ ట్విన్ ఓటర్ 9N-AET విమానంలో నలుగురు భారతీయులు, ఇద్దరు జర్మన్లు మరియు 13 మంది నేపాలీ ప్రయాణీకులు ఉన్నారని, వీరితో పాటు ముగ్గురు సభ్యుల నేపాలీ సిబ్బంది ఉన్నారని తారా ఎయిర్లైన్స్ ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా తెలిపారని హిందూస్తాన్ టైమ్స్ నివేదించింది. నేపాల్ మిస్సింగ్ విమానాకి సంబంధించి విమానయాన సంస్థ ప్రయాణీకుల జాబితాను విడుదల చేసింది. ఇందులో నలుగురు భారతీయులను అశోక్ కుమార్ త్రిపాఠి, అతని భార్య వైభవి బాండేకర్ (త్రిపాఠి) మరియు వారి పిల్లలు ధనుష్ మరియు రితికగా గుర్తించారు. ప్రస్తుతం ఈ కుటుంబం ముంబై సమీపంలోని థానే నగరంలో నివాసం ఉంటోంది.
“కొండ ప్రాంతాలు, మేఘాలు కమ్మేయడం, ప్రతికూల వాతావరణం కారణంగా సాధ్యమైన ప్రదేశాలలో జరిపిన శోధన కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడినందున మిస్సింగ్ విమానం పరిస్థితి ఇంకా తెలియలేదు” అని CAAN ప్రకటన తెలిపింది. “అయితే, రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ 24 గంటలు తెరిచి ఉంటుంది మరియు గాలి మరియు భూమి మార్గాల ద్వారా శోధన కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపింది” అని తెలిపింది. కానీ ఆ తర్వాత ప్రతికూల వాతావరణం నేపథ్యంలో సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ నిలిచిపోయింది.