దర్వాజ-అంతర్జాతీయం
Heavy Rains In Brazil: బ్రెజిల్ భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు 44 మంది చనిపోయారని అక్కడి స్థానిక మీడియా పేర్కొంది. ఈశాన్య బ్రెజిల్లో శనివారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో వరదలు రాగా, మరికొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఇప్పటివరకు 56 మంది ప్రాణాలు కోల్పోగా.. వందల మంది తప్పిపోయారని అధికారులు పేర్కొన్నారు. వర్ష ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. “భారీ వర్షాల కారణంగా 56 మంది మరణించారు. వందల మంది తప్పిపోయారు.. మరో 25 మంది గాయపడ్డారు.. 3,957 మంది ముపు ప్రభావిత ప్రాంతంలో ఉన్నారు” అని ప్రాంతీయ అభివృద్ధి మంత్రి డేనియల్ ఫెరీరా అన్నారు.
భారీ వర్షం ప్రభావం అధికంగా ఈశాన్య పెర్నాంబుకోలో ఉందని తెలిపారు. కొండచరియలు విరిగిపడిన బురద ప్రవాహం కారణంగా దాదాపు 28 మంది ప్రాణాలు కోల్పోయారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఆదివారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించినా ఉదయానికి తుపాను తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం వర్షాలు ఆగిపోయినప్పటికీ రానున్న కొద్ది రోజులు భారీ వర్షాలు కురుస్తాయని బ్రెజిల్ వాతావరణ విభాగం అంచనా వేసిన నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలు జాగ్రత్తతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
Update: The death toll from the heavy rains in northeastern state of Pernambuco in Brazil is now up to 56, according to officials.
— CGTN America (@cgtnamerica) May 29, 2022
Heavy Rain continues in many parts of Brazil
— INDEPENDENT PRESS (@IpIndependent) May 28, 2022
🔵The Coastal area of #Olinda recorded 199 mm of rain within 24 hours and the city of #Recife recorded 196 mm and in #Alagoas more than 250 mm in 24 hours. pic.twitter.com/4bsApDLXKo