దర్వాజ-హైదరాబాద్
Telangana: హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మైనర్ పై ఐదుగురి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఈ ఘటన విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ గత నెల 28న లైంగికదాడి జరిగితే 31న ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో పబ్ నుంచి బయటకు వచ్చిన మైనర్ బాలికను బలవంతంగా కారులో ఎక్కించుకుని సామూహిక అత్యాచారం చేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన శనివారం జరిగినప్పటికీ, బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మే 31న కేసు వెలుగులోకి వచ్చింది.
తనతో అసభ్యంగా ప్రవర్తించిందని మొదట తన కుటుంబ సభ్యులకు చెప్పింది బాలిక చెప్పింది. కానీ వారు ఆమె మెడపై గాయాలు చూసి ఆమెను మరింతగా ప్రశ్నించగా ఆమె లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన గురించి వెల్లడించింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 354 మరియు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు ప్రకారం.. మైనర్ జూబ్లీహిల్స్లోని అమ్నీషియా & ఇన్సోమ్నియా పబ్లో తన స్నేహితులు నిర్వహించిన పార్టీకి హాజరయ్యేందుకు వెళ్లింది. ఈ పార్టీని బాధితురాలి స్నేహితులు సూరజ్ మరియు హదీ నిర్వహించారు. సాయంత్రం 5:30 గంటల సమయంలో, ఒక ఇన్నోవాతో పాటు రెడ్ కలర్ మెర్సిడెస్ కారులో కొంతమంది అబ్బాయిలు ఆమెను పబ్ నుండి బయటకు తీసుకెళ్లారు.
బెంజికారులో ఓ ఎమ్మెల్యే కుమారుడు, మరో ప్రజాప్రతినిధి కుమారుడు, వారి స్నేహితులు ఉన్నారు. వీరంతా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని బేకరి వద్దకు వెళ్లి 6.15 గంటల వరకు అక్కడే ఉన్నారు. అనంతరం బాలిక .. ప్రజాప్రతినిధి కుమారుడు, అతని స్నేహితులు నలుగురితో కలిసి ఇన్నోవా కారు బయల్దేరింది. అనంతరం 7.30గంటలకు జూబ్లీహిల్స్లోని పబ్ వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు పబ్ ముందున్న సీసీటీవీ వీడియో ఫుటేజీతో పాటు కారు ప్రయాణించిన ఇతర ప్రాంతాలను పరిశీలించి నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నిందితుల్లో ఎమ్మెల్యే కుమారుడు, ఉన్నత స్థాయి వ్యక్తుల పిల్లలు ఉన్నారని, వీరిలో కొందరు మైనర్లు కూడా ఉన్నారని సమాచారం.
