Breaking
Sat. Jun 28th, 2025

Coronavirus: క‌రోనా ఫోర్త్ వేవ్ భ‌యాందోళ‌న‌లు.. పెరుగుతున్న కేసులు !

India, Covid-19, Coronavirus, క‌రోనా వైర‌స్, కోవిడ్-19, భార‌త్,

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ

Coronavirus 4th wave: దేశంలోని చాలా ప్రాంతాల్లో మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రజ‌ల్లో క‌రోనా వైర‌స్ ఫోర్త్ వేవ్ ఆందోళ‌న‌లు షురు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య‌, క‌టుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. దేశంలో గ‌త 24 గంట‌ల్లో మొత్తం 8329 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం క‌రోనా వైర‌స్ కేసుల సంఖ్య 4,32,13,435 కు చేరుకుంది. ఇదే స‌మ‌యంలో 10 మంది వైర‌స్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. మ‌ర‌ణాల సంఖ్య 5,24,757కు పెరిగింది.

ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 4,26,48,308 మంది క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్నారు. ప్ర‌స్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 40 వేల మార్కును దాటింది. దేశంలో క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కేసులు, మ‌ర‌ణాలు అధికంగా మ‌హారాష్ట్రలో న‌మోద‌య్యాయి. దాదాపు నాలుగు నెల‌ల గ‌రిష్ఠానికి కోవిడ్ రోజువారీ కేసులు చేరుకోవ‌డం..మ‌రీ ముఖ్యంగా ముంబ‌యిలో కోవిడ్‌-19 కేసులు అధికంగా న‌మోద‌వుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. మ‌హారాష్ట్ర త‌ర్వాత కేర‌ళ‌, క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్, వెస్ట్ బెంగాల్‌, ఢిల్లీ, ఒడిశా, రాజ‌స్థాన్‌, గుజ‌రాత్‌, చ‌త్తీస్‌గ‌ఢ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్, హ‌ర్యానాల్లో కోవిడ్‌-19 కేసులు, మ‌ర‌ణాలు అధికంగా న‌మోద‌య్యాయి.

Related Post