Breaking
Sat. Jun 28th, 2025

Telangana: ఆర్టీసీ ఛార్జీల పెంపుపై కోమటిరెడ్డి ఫైర్ !

Telangana,TSRTC , fares, Congress, MP Komatireddy Venkat Reddy, తెలంగాణ, టీఎస్ఆర్టీసీ, ఛార్జీలు, కాంగ్రెస్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,Revanth Reddy, రేవంత్ రెడ్డి,

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్

MP Komatireddy Venkat Reddy: తెలంగాణ ఆర్టీసీ బస్సు చార్జీల పెంపుపై కాంగ్రెస్ నేత‌, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మునుపెన్నడూ లేని విధంగా బస్సు చార్జీలను పెంచుతూ ఆర్టీసీ తీసుకున్న నిర్ణయాన్ని ఖండించారు. దీనిని సమీక్షించాలని కోరారు.బస్‌ ఛార్జీల పెంపుదల పేద, మధ్య తరగతి ప్రజలకు మోయలేని భారంగా మారుతుందని, గత 60 ఏళ్లలో ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోలేదని కోమటిరెడ్డి అన్నారు. విద్యార్థుల బస్‌పాస్‌ల పెంపును ప్రస్తావిస్తూ.. బస్‌ చార్జీల పెంపుదల విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేని స్థితిలో ఉందని దుయ్యబట్టారు.

Related Post