దర్వాజ-న్యూఢిల్లీ
Delhi borders with traffic: అగ్నిపథ్ స్కీమ్ కు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనల మధ్య నిరసనకారులు భారత్ బంద్కు పిలుపునిచ్చారు. దీంతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ కొనసాగుతోంది. భారత్ బంద్, అధికారుల తనిఖీల కారణంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులు ట్రాఫిక్తో నిండిపోయాయి. ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్ప్రెస్వేలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వేలాది వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. ప్రధాన పని వేళల్లో ట్రాఫిక్ అధికంగా కనిపించిందని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.
ANI నివేదికల ప్రకారం భారత్ బంద్ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు వాహనాలను విస్తృతంగా తనిఖీ చేయడం ప్రారంభించడంతో ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్ప్రెస్వే వద్ద సర్హౌల్ సరిహద్దు వద్ద భారీ ట్రాఫిక్ కనిపించింది.
Heavy traffic jam on Sarhaul border at Delhi-Gurugram expressway as Delhi Police begins checking of vehicles in wake of #BharatBandh against #AgnipathScheme, called by some organisations. pic.twitter.com/1VCo5RcHAJ
— ANI (@ANI) June 20, 2022
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న భద్రతా తనిఖీల కారణంగా దేశ రాజధానిలోని చిల్లా సరిహద్దు వద్ద నోయిడా-ఢిల్లీ లింక్ రోడ్డు వద్ద ఇదే పరిస్థితి కనిపించింది. నోయిడా ADCP రణ్విజయ్ సింగ్ మాట్లాడుతూ “ఎవరూ నిరసనకారులు ఇక్కడికి వెళ్లకుండా మేము చర్యలు తీసుకుంటున్నామని” తెలిపారు. సాయుధ బలగాల రిక్రూట్మెంట్ కోసం అగ్నిపథ్ పథకాన్ని కేంద్రం ప్రకటించిన తర్వాత నుంచి యువత నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తున్నది. ప్రతిపక్ష పార్టీలు నిరసనకారులకు మద్దతు ప్రకటించాయి.
#WATCH | Heavy traffic at Noida-Delhi Link Road at Chilla border due to security checks by UP Police in wake of Bharat Bandh against #AgnipathScheme
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 20, 2022
ADCP Noida, Ranvijay Singh says, "We're ensuring that no protester can pass through here, we're coordinating with Delhi Police." pic.twitter.com/SczgaxTn3W
