దర్వాజ-అంతర్జాతీయం
PM Modi in Munich: జీ7 సమ్మిట్ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నాడు జర్మనీ చేరుకున్నారు. ఈ పర్యటనలో మ్యూనిచ్ జరిగే G7 సదస్సులో పాల్గొంటారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం తెల్లవారు జామున జర్మనీ చేరుకుంటారనీ, అక్కడ జరిగే ఓ కార్యక్రమంలో పాలు పంచుకుంటారని అంతకు ముందు పీఎంవో కార్యాలయం ట్వీట్ చేసింది.
Ich bin in München gelandet. Ich werde am G-7-Gipfel teilnehmen. Später am Tag werde ich bei einem Gemeinschaftsprogramm sprechen. pic.twitter.com/NRGEl4xuuv
— Narendra Modi (@narendramodi) June 26, 2022
కాగా, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ ఆహ్వానం మేరకు జూన్ 26, 27 తేదీల్లో జరగనున్న జీ7 సదస్సుకు ప్రధాని మోడీ హాజరవుతున్నారు. ప్రపంచంలోని ఏడు సంపన్న దేశాల సమూహం అయిన G7 అధ్యక్షుడిగా జర్మనీ తన హోదాలో ఈ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహిస్తోంది. ప్రపంచ ఆహార మరియు ఇంధన సంక్షోభానికి ఆజ్యం పోయడమే కాకుండా భౌగోళిక రాజకీయ సంక్షోభాన్ని ప్రేరేపించిన ఉక్రెయిన్ సంక్షోభంపై G7 నాయకులు దృష్టి సారించాలని భావిస్తున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో ఇంధనం, ఆహార భద్రత, ఉగ్రవాద వ్యతిరేకత, పర్యావరణం మరియు ప్రజాస్వామ్యం వంటి అంశాలపై చర్చిస్తారు. జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ ష్కాల్జ్ అధ్యక్షత జరిగిన సమావేశం అనంతరం జీ7 దేశాల ప్రతినిధులు సంబంధిత అంశాల తీర్మానాలను ఆమోదించనున్నారు.
జీ7 సదస్సులో పాల్గొనేందుకు జర్మనీ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం జర్మనీలోని భారతీయ ప్రవాసుల పిల్లలతో మాట్లాడారు. రెండు రోజుల పర్యటన సందర్భంగా ఆయన బస చేయనున్న మ్యూనిచ్లోని హోటల్లో ప్రధానికి స్వాగతం పలికేందుకు చిన్నారులు తరలివచ్చారు.
Glimpses from the special welcome in Munich. pic.twitter.com/DITMr4TPYU
— Narendra Modi (@narendramodi) June 26, 2022