Hyderabad: తెలంగాణ సర్కారుపై NHRCకి ఫిర్యాదు
దర్వాజ-హైదరాబాద్
Telangana: తెలంగాణ సర్కారుపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర చీఫ్ బండి సంజయ్.. జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. కొత్త రేషన్ కార్డుల జారీలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఎన్హెచ్చార్సీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన 19 లక్షల రేషన్కార్డులు, కొత్త రేషన్కార్డుల జారీకి రూపొందించిన నిబంధనలపై కమిషన్ విచారణ జరిపించాలని కోరారు. రేషన్కార్డుల జారీపై విధించిన నిషేధాన్ని ఉపసంహరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రేషన్కార్డులు జారీ చేసేలా కమిషన్ చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు.
Wrote to @India_NHRC National Human Rights Commission seeking intervention and action against Telangana government for cancelling 19 lakhs of ration cards, allowing no grievance redressal mechanism and not opening fresh applications for ration cards. pic.twitter.com/fVgKevznaK
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) June 26, 2022
Share this content: