గర్భిణిని ఆస్పత్రి లిఫ్ట్ ఎక్కనివ్వని సిబ్బంది.. చివరకు.. ?
దర్వాజ-హైదారాబాద్
Hyderabad: హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాతబస్తీలోని ఓ ఆస్పత్రిలో ప్రసవ నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని ఆస్పత్రి లిఫ్ట్ ఎక్కడానికి వెళ్లనివ్వలేదు. దీంతో ఆ మహిళ తన కడుపులో ఉన్న శిశువును కోల్పోయింది. రోగులకు లిఫ్ట్ వినియోగాన్ని ఆసుపత్రి అధికారులు పరిమితం చేశారు. ఆస్పత్రి యాజమాన్యంపై నిర్లక్ష్యం కారణంగానే గర్భంలో శిశువు మృతి చెందినట్లు కేసు నమోదు చేసినట్లు నల్గొండ క్రాస్రోడ్ పోలీసులు తెలిపినట్టు సాక్షి నివేదించింది.
మరో ఘటనలో ప్రైవేట్ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ నవజాత శిశువు మృతి చెందింది. ఈ ఘటన హైదరాబాద్లోని చాదర్ఘాట్లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. వచ్చే నెలలో ఓ డాక్టర్ కూతురి పెళ్లి జరగనుండడంతో ఆస్పత్రి సిబ్బంది ముందుగానే పార్టీ చేసుకున్నారు. సిబ్బంది పూర్తిగా ఆనందంలో మునిగిపోయారు. ఆదివారం రాత్రి ఓ గర్భిణి ఆస్పత్రిలో చేరింది. ఆమెకు ఇంజక్షన్ ఇచ్చి అబ్జర్వేషన్లో ఉంచారు. ఆసుపత్రిని త్రీస్టార్ హోటల్గా మార్చారని, వైద్యులు పూర్తిగా మందుమైకంలో మునిగి..రోగులను చూసుకునే పరిస్థితిలో లేరని గర్భిణి కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రసవ నొప్పులతో బాధపడుతున్న మహిళ తల్లి ఆసుపత్రి సిబ్బంది వద్దకు వెళ్లగా, సిబ్బంది సరేనని చెప్పారు. సోమవారం తెల్లవారుజామున, ఆసుపత్రి సిబ్బంది నవజాత శిశువు పరిస్థితి విషమంగా ఉందని మరియు అతను మరణించినట్లు తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై మహిళ కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆసుపత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Share this content: