Breaking
Sat. Jun 28th, 2025

లోన్‌ రికవరీ ఏజెంట్ల వేధింపులతో మైనర్‌ ఆత్మహత్య

టీఎస్ఆర్టీసీ, తెలంగాణ‌, రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌, పెద్ద‌ప‌ల్లి, ఆత్మ‌హ‌త్య‌, TSRTC, Telangana, State Road Transport Corporation, Peddapally, Suicide,

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ పట్టణంలో లోన్‌ రికవరీ ఏజెంట్ల వేధింపులు తాళలేక 17 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడినట్లు శుక్రవారం నాడు అధికారులు తెలిపారు.దీనిపై న్యాయ సలహా తీసుకుని నిందితులపై చర్యలు తీసుకుంటామని నందిగాం ఇన్‌స్పెక్టర్‌ కనకరావు తెలిపారు. ఆమె చదువు ఖర్చుల కోసం రెండేళ్ల క్రితం కుటుంబం రూ.3.5 లక్షలు అప్పు చేసిందని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా తిరిగి చెల్లించలేకపోయార‌ని పోలీసులు తెలిపారు.

“రికవరీ ఏజెంట్లు వారి ఇంటికి వచ్చి వెంటనే మొత్తాన్ని చెల్లించాలని ఒత్తిడి చేశారు. ఫిర్యాదు స్వీకరించాం. లీగల్ ఒపీనియన్ తీసుకుని వారిపై చర్యలు తీసుకుంటాం’’ అని ఇన్ స్పెక్టర్ రావు తెలిపారు. దీనిపై తదుపరి విచారణ కొనసాగుతోంద‌ని తెలిపారు.

Related Post