Breaking
Sun. Jun 29th, 2025

పొలిటిక‌ల్ హీటు పెంచుతున్న నేష‌న‌ల్ హెరాల్డ్ కేసు.. నేడు కాంగ్రెస్ స‌మావేశం

darvaaja, Telugu news, Telugu News updates, తాజా వార్త‌లు, తెలుగు న్యూస్‌, ద‌ర్వాజ‌, Congress, Meet, Young Indian Office, government, Sonia Gandhi, Rahul Gandhi, Enforcement Directorate, ED, Delhi, National Herald newspaper, Mallikarjun Kharge, కాంగ్రెస్, స‌మావేశం, యంగ్ ఇండియన్ ఆఫీస్, ప్రభుత్వం, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఈడీ, ఢిల్లీ, నేషనల్ హెరాల్డ్

దర్వాజ-న్యూఢిల్లీ

National Herald case: గ‌తంలో మూసివేసిన నేష‌న‌ల్ హెరాల్డ్ కేసు తెర‌మీద‌కు తీసుకురావ‌డంతో పాటు.. తాజాగా యంగ్ ఇండియన్ ఆఫీస్‌ను కేంద్ర‌ ఏజెన్సీ సీల్ చేయ‌డంతో రాజ‌కీయాలు కాక‌రేపుతున్నాయి. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికతో ముడిపడి ఉన్న కేసుపై ఢిల్లీలోని యంగ్ ఇండియన్ కార్యాలయానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సీలు వేసిన తర్వాత కాంగ్రెస్ ఎంపీలు తమ వ్యూహంపై చర్చించడానికి గురువారం నాడు సమావేశం కానున్నారు. నేడు జ‌రిగే కాంగ్రెస్ భేటీతో ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

నేష‌న‌ల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి తాజా వివ‌రాలు ఇలా ఉన్నాయి..

  • ఢిల్లీలోని హెరాల్డ్ హౌస్‌లోని యంగ్ ఇండియన్ కార్యాలయానికి మంగళ, బుధవారాల్లో సోదాలు నిర్వహించే అవకాశం ఉన్నందున వారి వైపు నుండి ఎవరూ లేకపోవడంతో తాత్కాలికంగా సీలు వేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వర్గాలు తెలిపాయి.
  • ప్రిన్సిపల్ ఆఫీసర్, పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గేను సెర్చ్ ముగించడానికి పిలిపించారు. ఇది ముగిసిన అనంత‌రం యంగ్ ఇండియ‌న్ ఆఫీసుకు వేసిన సీల్ ను తీసివేస్తామ‌ని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి.
  • కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇంటి వెలుపల కూడా భారీ భద్రతను మోహరించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లే రహదారులను తాత్కాలికంగా బ్యారికేడ్ల‌తో క‌వ‌ర్ చేశారు.
  • కాంగ్రెస్ పార్టీని కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు ల‌క్ష్యంగా చేసుకుంద‌ని కాంగ్రెస్ ఆరోపించింది. ఇది తమ ప్రధాన కార్యాలయాన్ని, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇళ్లను “ఉగ్రవాదులు”గా చుట్టుముట్టిందని పేర్కొంది.
  • జైరామ్ రమేష్, అజయ్ మాకెన్, అభిషేక్ సింఘ్వీలతో సహా సీనియర్ కాంగ్రెస్ నాయకులు దీనిని “ప్రకటించని ఎమర్జెన్సీ”గా అభివర్ణించారు. ఈ రకమైన రాజకీయాలకు తమ పార్టీ భయపడబోదని అన్నారు.
  • ఈ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని విచారించిన కొద్ది రోజుల తర్వాత మంగళవారం దేశ రాజధానిలోని 12 చోట్లు స‌హా ఇతర ప్రదేశాలలో దర్యాప్తు సంస్థ దాడులు నిర్వహించింది.
  • అంతకుముందు సోనియా గాంధీ కుమారుడు, కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీని కూడా ఈడీ దాదాపు 50 గంటలకు పైగా పాటు ప్రశ్నించింది.
  • నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను ప్రచురించే యంగ్ ఇండియన్ అండ్ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) మధ్య జరిగిన ఆర్థిక అవకతవకలపై ED విచారణకు సంబంధించిన‌ది ఈ కేసు.
  • నేషనల్ హెరాల్డ్‌ను నడుపుతున్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌ని యంగ్ ఇండియన్ టేకోవర్ చేసింది. ఇది AJL కు చెందిన 800 కోట్ల ఆస్తులను తీసుకుంది. ఆదాయపు పన్ను శాఖ ప్రకారం.. ఇది భారతీయ వాటాదారులైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీల ఆస్తిగా పరిగణించబడాలి. దీనికి వారు పన్ను చెల్లించాలి. యంగ్ ఇండియన్ లాభాపేక్ష లేనిద‌ని, కాబట్టి వాటాదారులు దాని ఆస్తుల నుండి ఎలాంటి డబ్బు సంపాదించలేరని కాంగ్రెస్ పేర్కొంది.

Related Post