టీఆర్ఎస్లోకి వలసల పర్వం
దర్వాజ-సిద్దిపేట
Nangunoor: టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తెరాస ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో భారీగా చేరుతున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లాలోని నంగునూర్ మండల కేంద్రానికి ఇతర పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు, నాయకులు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. వారికి మంత్రి హరీశ్ రావు గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి తగిన గౌరవం ఉంటుందని అన్నారు. పార్టీ అభివృద్దికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఫోరమ్ అధ్యక్షులు చౌడుచెర్ల జయపాల్ రెడ్డి, నంగునూర్ పిఎసిఎస్ చైర్మన్ కోల రమేష్ గౌడ్, ఎంపీటీసీ బెదురు తిరుపతి యాదవ్, నాయకులు ఉల్లి మల్లయ్య యాదవ్, రచ్చ సిద్దు, దేవులపల్లికనకయ్య,దేవులపల్లి గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this content: