దర్వాజ-పాట్నా
Bihar Political Crisis: దేశంలో బీహార్ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఏన్డీయే కూటమికి గుడ్ బై చెప్పిన నితీష్ కుమార్ తన పాత మిత్ర పక్షాలతో కలిసి మళ్లీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకు సాగుతున్నారు. ‘మహాఘట్బంధన్’ కూటమికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు నితీష్ కుమార్, ఆర్జేడీకి చెందిన తేజస్వి యాదవ్తో కలిసి గవర్నర్ ఇంటికి చేరుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుందని సమాచారం. కాగా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో పొత్తును తెంచుకుని సీఎం పదవికి మంగళవారం రాజీనామా చేశారు. ఇద్దరు నేతలూ ఒకే కారులో రాజ్భవన్కు చేరుకున్నారు. వీరితో పాటు జేడీయూ నేతలు రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్, విజయ్ కుమార్ చౌదరి, శ్రవణ్ కుమార్, ఇతర నేతలు కూడా హాజరయ్యారు.
తన తదుపరి రాజకీయ ఎత్తుగడలపై చర్చించేందుకు కుమార్, అంతకుముందు జేడీయూ నేతలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత గవర్నర్ ఫాగు చౌహాన్ను సమయం కోరారు. సాయంత్రం 4 గంటలకు, నితీష్ కుమార్ రాజ్ భవన్కు చేరుకుని, గవర్నర్ ఫాగు చౌహాన్ను కలుసుకుని, రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలన్న తన నిర్ణయాన్ని ఆయనకు తెలియజేశారు. అంతకుముందు, జరిగిన జేడీయూ సమావేశంలో, పార్టీ ఎమ్మెల్యేలు-ఎంపీలు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నిర్ణయానికి మద్దతు పలికారు. ఏ నిర్ణయం తీసుకున్న ఆయనతో ఉంటామని చెప్పారని సమాచారం.
బీజేపీ రాష్ట్రంలో విస్తరిస్తూ.. తమను బలహీన పర్చే చర్యలు తీసుకుందని చాలా మంది జేడీయూ నేతలు వెల్లడించారు. చిరాగ్ పాశ్వాన్ పేరు చెప్పకుండా, 2020 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాజీ లోక్ జనశక్తి పార్టీ (ఎల్జెపి) చీఫ్ చర్యలను శాసనసభ్యులు గుర్తుచేసుకున్నారని, వారు అప్రమత్తంగా లేకపోతే పార్టీకి మంచిది కాదని సిఎంను హెచ్చరించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, రాష్ట్రంలోని ప్రతిపక్ష సమగత్బంధన్’ కూటమిలో భాగమైన CPI-ML మరియు కాంగ్రెస్ నాయకుల భాగస్వామ్యంతో RJD నేతృత్వంలోని మహాఘట్భంధన్ ప్రతిపక్ష కూటమి సమావేశం కూడా ఈరోజు ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి నివాసంలో జరిగింది.

సంబంధిత వర్గాల ప్రకారం.. సమావేశం తరువాత, రాష్ట్రీయ జనతాదళ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు-రాజ్యసభ ఎంపీలు పార్టీ నాయకుడు తేజస్వి యాదవ్కు నిర్ణయం తీసుకోవడానికి అధికారం ఇచ్చారు. ఆయనకు తమ మద్దతును ప్రకటించారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల ఎమ్మెల్యేలు కూడా యాదవ్కు మద్దతు తెలిపారని విశ్వసనీయ వర్గాల సమాచారం. బీజేపీ లేకుండా బీహార్ అధికార సంకీర్ణంలో మళ్లీ పొత్తు పెట్టుకోవడాన్ని తాము స్వాగతిస్తామని రాష్ట్రంలోని ఆర్జేడీ నేతృత్వంలోని ప్రతిపక్షం పేర్కొంది.