దర్వాజ- సిద్దిపేట్
Nangnoor-siddipet: నంగునూర్ మండల కేంద్రంలో భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పెద్దఎత్తున పాల్గొంటున్నారు. ప్రతి ఒక్కరిలో స్వాతంత్య్ర స్ఫూర్తి చాటేలా, జాతీయ దృక్పథంతో ఎందరో అమరులు చేసిన త్యాగాలు స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జెండా విశిష్టతను, ప్రాముఖ్యతను వివరించారు. ప్రతిఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరేయాలని, పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, మండల తెరాస నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు,గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.