దర్వాజ-న్యూఢిల్లీ
Bilkis Bano’s case: గర్బిణి పై గ్యాంగ్ రేప్ (సామూహిక అత్యాచారం) చేయడంతో పాటు ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని అత్యంత క్రూరంగా నరికి చంపిన దోషులను ఇటీవల బీజేపీ పాలిత గుజరాత్ సర్కారు విడుదల చేసింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు జైలు నుంచి విడుదలైన దోషులను పలువురు స్వీట్లు పంచుతూ.. పూలమాలలు వేస్తున్న వీడియోలు వైరల్ కావడంతో ఈ అంశం మరింత ముదిరింది. అయితే, గుజరాత్ ప్రభుత్వం మాత్రం వారి విడుదలను సమర్థించుకోవడం గమనార్హం.
Godhra ( Gujarat): Rape convicts in #BilkisBano case and killers of 14 innocent Muslims get warm welcome and garlanded by VHP. pic.twitter.com/peVsNQHf5S
— MuslimMirror.com (@MuslimMirror) August 16, 2022
ఈ విషయంపై ప్రతిపక్షాలు గుజరాత్ ప్రభుత్వం, ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి పీ.చిదంబరం స్పందిస్తూ గుజరాత్ లోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. బిల్కిస్ బానో కేసు దోషులను గుజరాత్ లో స్వాగతించే వీడియోపై స్పందిస్తూ మహిళలను గౌరవించాలని ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన ఉద్బోధ “మాటలు” అని, గుజరాత్ ప్రభుత్వ నిర్ణయం “చర్య” అని అన్నారు. మహిళలను గౌరవించాలని ప్రధాని ప్రజలకు ఉద్బోధించిన కొన్ని గంటల తరువాత, ప్రధాని మోడీ స్వరాష్ట్రం, బీజేపీ సర్కారు ఉన్న గుజరత్ ప్రభుత్వం సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులుగా తేలిన వారి శిక్షను రద్దు చేసి.. విడుదల చేస్తుంది. గుజరాత్ ప్రభుత్వం ప్రతిపాదిత చర్య గురించి ప్రధానికి తెలియదా? అని చిదంబరం ప్రశ్నించారు.
Hours after PM's exhortation to people to respect women, his hand-picked Gujarat govt grants remission of the remaining sentence to persons convicted of gang rape
— P. Chidambaram (@PChidambaram_IN) August 16, 2022
Did the PM not know about the proposed action of the Gujarat govt? Did’nt the intelligence agencies forewarn the PM?
కాగా, బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబంలోని ఏడుగురు సభ్యుల హత్య కేసులో మొత్తం 11 మంది యావజ్జీవ కారాగార శిక్ష పడిన దోషులు సోమవారం గోద్రా సబ్ జైలు నుంచి బయటకు వచ్చారు. 2008 జనవరి 21న బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో 11 మంది నిందితులకు ముంబైలోని సీబీఐ ప్రత్యేక కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. బాంబే హైకోర్టు సైతం వారి శిక్షను సమర్థించింది. నిందితుల్లో ఒకరు 15 ఏళ్లకు పైగా జైలు శిక్షను అనుభవించారని, వారిలో ఒకరు ముందస్తు విడుదల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనికి సుప్రీం కోర్టు గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోమనగా.. రిమిషన్ అంశాన్ని పరిశీలించి బీజేపీ సర్కారు వారిని విడుదలకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. రేపిస్టులు, హత్యా దోషులను విడుదల చేయడంతో గుజరాత్ ప్రభుత్వం, ప్రధాని మోడీపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.