Breaking
Sat. Jun 28th, 2025

చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

ద‌ర్వాజ‌- సిద్దిపేట్

Nangnoor-siddipet: స్వాతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా నంగునూర్ మండ‌ల కేంద్రంలోని ప్ర‌భుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఆట‌ల‌పాట‌ల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు గురువారం నాడు భూలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, ఉపాధ్యాయుడు శనిగరం కనకయ్య ఆధ్వ‌ర్యంలో బహుమతుల ప్రధానోత్సవం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎనగందుల మనీష్ కుమార్ మాట్లాడుతూ.. ఆట‌ల‌పాట‌ల పోటీల్లో విజేత‌లుగా నిలిచి విద్యార్థుల‌ను అభినందించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని, క్రీడాకారులకు బంగారు భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. అలాగే.. భూలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ సేవల‌ను కొనియాడారు.

అనంత‌రం భూలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, ఉపాధ్యాయుడు శనిగరం కనకయ్య మాట్లాడుతూ.. విద్యార్థులు కేవలం చ‌దువుల్లోనే కాకుండా.. ఆట‌ల‌పాట‌ల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నాల‌ని అన్నారు. క్రీడల వల్ల స్నేహబంధాలు పెరుగుతాయని, మానసికోల్లాసం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎనగందుల మనీష్ కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు శనిగరం కనకయ్య, తహసిన్ సుల్తానా, కోల శ్రీనివాస్, పత్రి మల్లేశం, రామకృష్ణ, వెంకటేశం, పరమేశ్వరులు పాల్గొన్నారు.

Related Post