దర్వాజ- సిద్దిపేట: సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరంగా మారిందని రాష్ట్ర ఆర్థిక , వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలో మంత్రి క్యాంప్ కార్యాలయంలో నంగునూర్ మండల పరిధిలోని పలు గ్రామాల లబ్ధిదారులకు మంత్రి హరీష్ రావు శనివారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. పేదలకు వైద్య సేవలు భారం కావొద్దని సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకుంటున్నారన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకొన్న అందరికీ ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో అమలవుతున్న ప్రతి పథకాన్ని అర్హులైన వారందరికి అందిస్తున్నామన్నాని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నంగునూర్ పీఎసీఎస్ చైర్మెన్ కోల రమేశ్ గౌడ్, పాలమాకుల పీఏసీఎస్ చైర్మెన్ మహిపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మెన్ ఎడ్ల సోమిరెడ్డి, తదితర స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
