దర్వాజ- హుస్నాబాద్: లయన్స్ క్లబ్ ఆఫ్ హుస్నాబాద్ ఆధ్వర్యంలో మరణానంతరం నేత్రాలను సేకరించారు. శుక్రవారం హుస్నాబాద్ పట్టణ కేంద్రంలో దూడం సత్తవ్వ అనే మహిళ మృతి చెందగా లయన్స్ క్లబ్ ఆఫ్ హుస్నాబాద్ చెందిన హుస్నాబాద్ అలయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ అల్లీ మోర అంజయ్య, జిల్లా కోశాధికారి అల్లీ దూడం నాగభూషణం, జోన్ చైర్మన్ వెల్దండి భాస్కర్ లు మృతురాలి కుటుంబ సభ్యులతో సంప్రదించారు. నేత్రదానంపై అవగాహన కల్పించి.. ఎల్ వి ప్రసాద్ నేత్ర వైద్యుల సహకారంతో దాత సత్తావ్వ మృత దేహం నుండి నేత్రాలను సేకరించారు.
ఈ సందర్భంగా జిల్లా గవర్నర్ అల్లీ మోర అంజయ్య మాట్లాడుతూ.. అవయవ దానం కొందరిని చిరస్మరణీయులను చేస్తూ .. మరికొందరు జీవితాల్లో వెలుగులు నింపుతుందని అన్నారు. అవయవ దానం వల్ల ఒక్క మనిషి పదుల సంఖ్యలో జీవితాలను నిలబెట్టవచ్చనీ, గుండె, మూత్రపిండం, కాలేయం, పాంక్రియాస్, చేతులు, ముఖం, కళ్లు, ఎముక మూలుగ, కణాలు ఇలా దాదాపు 200 అవయవాలు దానం చేయవచ్చని తెలిపారు.
చనిపోయిన తర్వాత అవయవ దానం చేయడం వల్ల మరొకరి జీవితం నిలబడటమే కాకుండా.. చనిపోయిన వారు జీవించినట్లు ఉంటుందని అన్నారు. నేత్ర దానం చేయడం వల్ల.. చనిపోయినా వారు సజీవంగా ఉన్నట్లేననీ, వారి కండ్లతో మరోక ఇద్దరికి చూపు లభిస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ నేత్ర దానం కోసం ముందుకూ రావాలనీ, తద్వారా అంధత్వ నిర్మూలన జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.. నేత్ర దానం, అవయవ దానం చేయాలని భావించేవారు 9948426272, 8125778209 నెంబర్లకు సంప్రదించాలని అలయన్స్ జిల్లా గవర్నర్ అల్లీ మోర అంజయ్య కోరారు.