Breaking
Sat. Jun 28th, 2025

రేపే కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహ ఆవిష్క‌ర‌ణ‌

స్వాత్రంత్య సమరయోధులు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్రహ ఆవిష్క‌ర‌ణ ఈ నెల 28న సిద్దిపేట పట్టణంలోని వేములవాడ కమాన్ సిరిసిల్ల రోడ్డులో ఉన్న సుడా పార్కు వద్ద కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని సిద్దిపేట పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కస్తూరి సతీష్ కోరారు. ప్రెస్ క్లబ్ లో పద్మశాలి సంఘం నాయకులు మాట్లాడుతూ ఈనెల 28న ఉదయం 11 గంటలకు జరిగే కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు, జెడ్పీ చైర్ పర్సన్ రోజా రాధాకష్ణ శర్మ, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, రగోత్తంరెడ్డి, ఎల్ రమణ పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో పద్మశాలి సంఘం నాయకులు డాక్టర్ స్వామి, మల్లేశం, శ్రీధర్, శ్రీశైలం, రమేష్, శ్రీనివాస్, మార్కండేయులు, ఆగయ్య, బిక్షపతి, విట్టల్, నగేష్, ఆంజనేయులు పాల్గొన్నారు.

Related Post