నంగునూర్ మండల కేంద్రంలోని దేవి శరన్నవరాత్రోత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో మంగళవారం మట్టి వినాయకుడి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారు చేసిన గణపతులను పూజించడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్టు కమిటీ సభ్యులు సాదుల రాజు, హరీష్ తెలిపారు.
ఈ సందర్భంగా పీఏసీఎస్ చైర్మన్ కోల రమేష్ గౌడ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు బదులుగా మట్టి వినాయకులనే వాడాలని అన్నారు. ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా భావించి వాతావరణాన్నిరక్షించాలని కోరారు. వినాయకచవితి పండుగ మట్టిగణపతితోనే ప్రారంభమైనదని దానిని గ్రహించి మట్టి బొమ్మల విశిష్టతను తెలుసుకొని మట్టి వినాయకులతోనే వినాయకుని పండగ జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన దేవి శరన్నవరాత్రోత్సవ కమిటీ సభ్యులను హృదయ పూర్వకంగా అభినందిస్తున్ననని అన్నారు.
మాజీ ఎంపీటీసీ చౌడుచెర్ల జయపాల్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కు ప్రతి ఒక్కరు పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమలను చేస్తున్న దేవి శరన్నవరాత్రోత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కోల రమేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ చౌడుచెర్ల జయపాల్ రెడ్డి, రాజగోపాలపేట ఎస్సై మహిపాల్ రెడ్డి, ఉపసర్పంచ్ దాసరి చంద్రకళా రవికుమార్, కో ఆప్షన్ సభ్యులు రహీం పాషా, రైతుబందు సమితి గ్రామశాఖ అధ్యక్షులు కోల సతీష్ గౌడ్, మంగు రాధాకిషన్ రావు, సాయినాథ్ శర్మ, ఆకుబత్తిని రాము, కోల శ్రీధర్ గౌడ్, రచ్చ సిద్దు, బద్దుల కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
