దర్వాజ – నంగునూర్: నంగునూర్ మండల కేంద్రంలోని వివేకానంద యూత్ ఆధ్వర్యంలో సిద్ది వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం నాడు శనిగరం భూలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ నిర్వాహకులు ఉపాధ్యాయులు శనిగరం కనకయ్య సౌజన్యంతో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా శనిగరం కనకయ్య మాట్లాడుతూ.. అన్ని దానములలోకెల్లా అన్నదానం గొప్పదని.. మన శాస్త్రాలు చెబుతున్నాయని, ఇటువంటి కార్యక్రమాల ద్వారా సమాజం నందు సంఘటిత శక్తి ఏర్పడుతుందని అన్నారు. ఆ స్వామివారి కరుణాకటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు చౌడు చెర్ల జయపాల్ రెడ్డి, దాసరి రవి, వేముల రాజమౌళి, లక్ష్మీ నరసయ్య, వివేకానంద యూత్ సభ్యులు శనిగరం నవీన్, శ్రీకాంత్, అంజనీ ప్రసాద్, నగేష్, నిరంజన్, అశోక్, శ్రీనివాస్, రాము, రాజేందర్, రాజు తదితరులు పాల్గొన్నారు
అన్నం పరబ్రహ్మ స్వరూపం !
