Breaking
Sat. Jun 28th, 2025

స‌మాజానికి సర్వేపల్లి ఆదర్శప్రాయుడు

ద‌ర్వాజ‌- నంగునూర్: నంగునూర్ మండల కేంద్రంలోని శాంతినికేత‌న్ హైస్కూల్ లో ఉపాధ్యాయ‌ దినోత్సవ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పాఠ‌శాల ఉపాధ్యాయులను యాజ‌మాన్యం సన్మానించింది. ఈ సందర్భంగా పాఠ‌శాల ప్రిన్సిపాల్ మోర అంజ‌య్య మాట్లాడుతూ.. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం భావితరాల‌కు ఆద‌ర్శ‌మ‌ని, ఆయ‌న త‌న జీవితాన్ని ఉపాధ్యాయుడుగా ప్రారంభించి.. అంచ‌లంచెలుగా ఎదుగుతూ.. దేశానికి తొలి ఉపరాష్ట్రపతిగా.. రెండ‌వ రాష్ట్ర‌ప‌తిగా రాష్ట్రపతిగా సేవలందించిన సర్వేపల్లి ఆదర్శప్రాయమైన విద్యావేత్త అని కొనియాడారు. ఆయ‌న ఉపాధ్యాయ వృత్తికే వన్నెతెచ్చిన గొప్ప ఉపాధ్యాయుడని అన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ‌ బృందాన్ని సన్మానించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆ తర్వాత పాఠ‌శాల క‌రస్పాండెంట్ మోర లావ‌ణ్య మాట్లాడుతూ.. సమాజశ్రేయస్సు ప్రధాత ఉపాధ్యాయుడేనని అన్నారు. అంతేకాదు నవభారత నిర్మాణంలో ఉపాధ్యాయుని పాత్ర ఎనలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠ‌శాల ప్రిన్సిపాల్ మోర అంజ‌య్య, క‌రస్పాండెంట్ మోర లావ‌ణ్య, పాఠ‌శాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

nangnoor-11-1-1024x576 స‌మాజానికి సర్వేపల్లి ఆదర్శప్రాయుడు

Related Post