Breaking
Sat. Jun 28th, 2025

జయములివ్వు వినాయ‌కా.. !

ద‌ర్వాజ‌- నంగునూర్: నంగునూర్ మండ‌ల కేంద్రంలో సిద్ది వినాయక నవరాత్రి ఉత్సవ వేడుక‌లు వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి. ఈ సారి వాడవాడలా అధికసంఖ్యలో భారీ విగ్రహాలను ప్రతిష్ఠించారు. అదిరిపోయే సెట్టింగ్‌లు, విద్యుత్‌ కాంతులతో మండపాలు జిగేల్‌మంటున్నాయి. మండ‌ల కేంద్రంలోని పద్మ‌శాలి స‌మాజంలో ఛ‌త్ర‌ప‌తి శివాజీ ఫ్రెండ్స్‌ యూత్ ఆధ్వ‌ర్యంలో భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఘ‌నంగా ఉత్స‌వాలు నిర్వ‌హిస్తున్నారు. ఉత్స‌వాల్లో భాగంగా యూత్ స‌భ్యులు సోమ‌వారం భ‌క్తుల‌కు అన్న‌దాన కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా పీఏసీఎస్ చైర్మెన్ కోల ర‌మేశ్ గౌడ్, మాజీ ఏఎంసీ చైర్మెన్ ఎడ్ల సోమిరెడ్డి లు హాజ‌రయ్యారు. వినాయ‌క మండపంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి, స్వామి వారి తీర్థ ప్ర‌సాదాల‌ను స్వీక‌రించారు. అనంత‌రం ఆ యూత్ ఏర్పాటు చేసిన అన్న‌దాన కార్య‌క్ర‌మంలో పాల్గొని భ‌క్తుల‌కు భోజ‌నాలు వడ్డించారు. ఈ క్ర‌మంలో యూత్ స‌భ్యులు వారిని శాలువ‌లు క‌ప్పి స‌న్మానించారు. అలాగే.. అన్న‌దాన కార్య‌క్ర‌మానికి స‌హక‌రించిన దార్న సునిత‌- హ‌రిప్ర‌సాద్ దంప‌తుల‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మెన్ కోల ర‌మేశ్ గౌడ్, మాజీ ఏఎంసీ చైర్మెన్ ఎడ్ల సోమిరెడ్డి, తెరాస గ్రామశాఖ అధ్య‌క్షులు ఉల్లి మ‌ల్ల‌య్య, తెరాస నాయ‌కులు దాసరి ర‌వికుమార్, ర‌చ్చ సిద్దు, ఆకుబ‌త్తిని రాము, దార్న హ‌రి ప్ర‌సాద్, ఛ‌త్ర‌ప‌తి శివాజీ ఫ్రెండ్స్‌ యూత్ స‌భ్యులు ప్ర‌శాంత్, వివేక్,శివ‌, అఖిల్, రాకేశ్, భార్గ‌వ్, ర‌ఘ‌వేంద్ర‌, సాయిరాం, మ‌ణిదీప్‌, దుర్గేశ్, సాయితేజ‌, ప‌వ‌న్ కుమార్, ఆదిత్య‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related Post