- దిశరవికి బెయిల్ మంజూరు.. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కుంది
- ప్రభుత్వంతో విభేదిస్తే జైలుపాలు చేయలేరు !
- వాక్ స్వాతంత్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ, అసమ్మతి హక్కులపై కోర్టు కీలక వ్యాఖ్యలు
అయి కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన సాగు చట్టాలపై ఇప్పటికీ దేశవ్యాప్తంగా రైతులు వ్యతిరేకత తెలుపుతూ దేశరాజధాని సరిహద్దులో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అన్నదాతలకు జాతీయ, అంతర్జాతీయంగా పలువురు సంఘీభావం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పర్యావరణ కార్యకర్త దిశారవి.. రైతులకు మద్దతు తెలిపారు. అయితే, దేశానికి వ్యతిరేకంగా, ఖలిస్థాన్ వేర్పాటువాదులకు అనుకూలంగా కుట్రపన్నుతూ ఓ “టూల్ కిట్”ను రూపోందించారని పోలీసులు ఆరోపించారు. ఈ క్రమంలోనే ఢిల్లీ పోలీసులు ఆరెస్టు వారెంట్ జారీ చేసి ఆమెను అరెస్టు చేయడంతో.. కోర్టు వరకు వెళ్లింది.
అయితే, తాజాగా దిశరవిపై పోలీసులు చేసిన ఆరోపణలకు సంబంధించి ఏకీభవించని కోర్టు ఆమెకు బెయిల్ ఇచ్చింది. అయితే, దిశారవి బెయిల్కు సంబంధించి కోర్టు బెయిల్ ఏం చెబుతోంది? కోర్టు చేసిన పలు కీలక వ్యాఖ్యలు ఇప్పుడు దేశంలో అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. ఎందుకంటే ఢిల్లీ కోర్టు దిశా రవికి బెయిల్ మంజూరు చేస్తూ, దేశంలో వాక్ స్వాతంత్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ, అసమ్మతి హక్కుకు అనుకూలంగా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. అందులో న్యాయస్థానం ప్రస్తావించిన ప్రధాన ఐదు అంశాలు ఉన్నాయి.
మొదటిది టూల్ కిట్ మీద
“.. వాట్సాప్ గ్రూపును సృష్టించడం లేదా ఇన్నోక్యూస్ టూల్ కిట్కు ఎడిటర్గా ఉండటం నేరం కాదు” అని కోర్టు తన ఆర్డర్లో పేర్కొంది. ఏదైనా డాక్యుమెంట్ను వ్యాప్తికి చేయడంతో ఎలాంటి హింసను చొప్పించాలనే ఉద్దేశం లేనప్పుడు.. పౌరులు ప్రభుత్వ విధానాలతో విభేధించడాన్ని ఎంచుకుంటే వారిని బార్స్ వెనుక ఉంచలేము అని కోర్టు తెలిపింది.
రెండోది రాజద్రోహం ఆరోపణలపై
దిశారవిపై పోలీసులు మోపిన ఆరోపణలు శిక్షార్హమైనవి కావనీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది, అలాగే, ఆమె వేర్పాటు వాదులతో కుట్ర పన్నారనేదానికి ఎలాంటి సాక్ష్యాలు లేవని పేర్కొంది. పోలీసులు ఆరోపణలకు సంబంధించి అన్ని అంశాలు అసంపూర్తిగా ఉన్నాయని పేర్కొంది. ఊహాజనితమైన విషయాల ఆధారంగా రాజద్రోహం వంటి కేసులు మోపుతూ వ్యక్తుల స్వేచ్ఛను హరించే అధికారం లేదని స్పష్టం చేసింది.

మూడవ అంశం.. వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనస్వేచ్ఛపై
అసమ్మతి హక్కు రాజ్యాంగంలోని 19వ అధికరణం ప్రకారం హామీ ఇవ్వబడిందని కోర్టు సమర్థించింది, దేశ వ్యవస్థాపక పితామహులు “అభిప్రాయ భేదాలు గల వారి పట్ల తగిన గౌరవం” కలిగి ఉన్నారని కోర్టు స్పంష్టం చేసింది. “నా అభిప్రాయంలో.. వాక్, భావ ప్రకటనా స్వేచ్ఛ లో ప్రపంచ మద్దతు కోరే హక్కు ఉంది. కమ్యూనికేషన్కు ఎలాంటి భౌగోళిక అడ్డంకులు లేవుష అని కోర్టు పేర్కొంది.
“ఈ 5000 సంవత్సరాల నాటి నాగరికత వైవిధ్యమైన వర్గాల ఆలోచనలకు ఎప్పుడూ విముఖత చూపలేదు. భిన్నమైన అభిప్రాయాలకు మన గౌరవాన్ని వ్యక్తపరిచే మన సాంస్కృతిక నీతిని సూచిస్తుంది” అని న్యాయస్థానం తెలిపింది.
వ్యక్తిగత స్వేచ్ఛపై
దిశ రవి ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీలో విచారణ జరిపిన విషయాన్ని ప్రస్తావించిన న్యాయస్థానం.. ఆమె స్వేచ్ఛపై మరింత సంయమనం పాటించటం “సహేతుకమైనది లేదా చట్టబద్ధమైనది కాదు” అని పేర్కొంది. అలాగే, దిశరవికి బెయిల్ పై ఢిల్లీ పోలీసులు చేస్తున్న వ్యతిరేకత అలంకారిక స్వాభావం అని కోర్టు తెలిపింది.
ఐదోవ అంశం.. ఆధారాలు లేకపోవడంపై
దిశ రవి.. భారత ప్రభుత్వం, హింసను ప్రేరేపించే విధంగా కుట్ర పన్నారని పోలీసులు చేస్తున్న వాదనలు బలపడటానికి ఎలాంటి సాక్ష్యాధారాలు సమర్పించలేదని కోర్టు స్పష్టం చేసింది. రికార్డులను పరిశీలిస్తే 22 ఏండ్ల దిశరవికి బెయిల్ నిరాకరించడానికి స్పష్టమైన ఆధారాలు కనిపించడం లేదని న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. తీర్పును రిజర్వులో ఉంచింది.
టీవీ, మొబైల్స్.. డెంజర్లో టీనేజర్స్ !
ఆడ పిల్లల గౌరవాన్ని కాపాడలేకపోతున్న ప్రభుత్వం