పిల్లల్ని ఎత్తుకుపోతున్నారనే అనుమానంతో సాధువులపై దాడి
దర్వాజ-ముంబయి
Sadhus sadhus attacked: పిల్లలను ఎత్తుకుపోతున్నారనే అనుమానంతో మహారాష్ట్రలో నలుగురు సాధువులపై దాడి జరిగింది. ఒక కిరాణా దుకాణం ముందు ఉన్న సమయంలో కొంత మంది వ్యక్తులు వారిపై కర్రలతో దాడి చేశారు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో నలుగురు సాధువులపై దాడి జరిగింది. చిన్నారులను ఎత్తుకుపోతున్నారనే అనుమానంతో అక్కడివారు సాధువులపై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. లవణ గ్రామంలో మంగళవారం నాడు ఘటన చోటుచేసుకుంది. అయితే, ఈ ఘటనపై తమకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. “సాధువులను కొడుతున్న ఘటనకు సంబంధించి మాకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు. వైరల్ వీడియోలను పరిశీలిస్తున్నాము. వాస్తవాలను ధృవీకరించాల్సి ఉంది. తగిన చర్యలు తీసుకుంటాము” అని పోలీసులు తెలిపారు.
@narendramodi ji This is how they continue beat up sadhus in Maharashtra.Killing a elephant or beating up Sadhus will bring unbearable natural disasters to Maharashtra.Hell is waiting to come down on Maharashtra. @Dev_Fadnavis you suffered for taking over Shani temple, now this. pic.twitter.com/migfnIm5Rs
— Kanimozhi (@kanimozhi) September 14, 2022
అయితే, మీడియా నివేదికల ప్రకారం.. ఉత్తరప్రదేశ్కు చెందిన సాధువులు కర్ణాటకలోని బీజాపూర్ నుండి పంఢర్పూర్కు వెళుతుండగా ఒక బాలుడిని మార్గం గురించి అడిగారు. దీంతో పిల్లలను ఎత్తుకుపోయేవారని అనుమానించిన ప్రజలు వారిపై కర్రలతో దాడి చేశారు. కాగా, సాధువులు ఉత్తరప్రదేశ్లోని ‘ అఖాడా’లో సభ్యులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Share this content: