గోవాలో కాంగ్రెస్ పార్టీ షాక్.. బీజేపీలోకి 8 మంది ఎమ్మెల్యేలు !
దర్వాజ-పనాజీ
Goa Politics: గోవాలో కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగలనుందని సమాచారం. రాష్ట్ర మాజీ సీఎం దిగంబర్ కామత్, ప్రతిపక్ష నేత మైఖేల్ లోబో సహా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుధవారం నాడు బీజేపీలో చేరనున్నట్లు ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ సదానంద్ షెట్ తనవాడే తెలిపారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్కు ముగ్గురు ఎమ్మెల్యేలు మిగలనున్నారు.
భారతీయ జనతా పార్టీలోకి గోవా కాంగ్రెస్ నాయకులు దిగంబర్ కామత్, మైఖేల్ లోబో, డెలిలా లోబో, రాజేష్ ఫాల్దేశాయ్, కేదార్ నాయక్, సంకల్ప్ అమోంకర్, అలెక్సో సిక్వేరా, రుడాల్ఫ్ ఫెర్నాండెజ్లు చేరే అవకాశం ఉంది. ఇప్పటికే వారు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ను కూడా కలిశారని వార్తా సంస్థ ఏఎన్ఐ నివేదించింది.
Goa | 8 Congress MLAs incl Digambar Kamat, Michael Lobo, Delilah Lobo, Rajesh Phaldesai, Kedar Naik, Sankalp Amonkar, Aleixo Sequeira & Rudolf Fernandes to join BJP today; also met with CM Pramod Sawant
— ANI (@ANI) September 14, 2022
Share this content: