Breaking
Mon. Jun 30th, 2025

లఖింపూర్ ఖేరీలో అక్కాచెల్లెళ్లపై అత్యాచారం, ఆపై హత్య.. ఆరుగురు అరెస్టు

rape, murder, Dalit sisters, Lakhimpur Kheri, Uttar Pradesh, police, అత్యాచారం, హత్య, దళిత సోదరీమణులు, లఖింపూర్ ఖేరీ, ఉత్తరప్రదేశ్, పోలీసులు,

దర్వాజ-లక్నో

Uttar Pradesh: ఇద్దరు దళిత సోదరీమణులపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు లఖింపూర్ ఖేరీ ఎస్పీ సంజీవ్ సుమన్ తెలిపారు. వివ‌రాల్లోకెళ్తే.. బుధ‌వారం నాడు ఇద్ద‌రు అక్కాచెల్లెళ్ల మృత‌దేహాలు చెట్టుకు వేలాడుతూ క‌నిపించాయి. న‌లుగురు నిందితులు త‌మ కూతుళ్ల‌ను కిడ్నాప్ చేశార‌ని కుటుంబ స‌భ్యులు ఆరోపించారు. ఈ క్ర‌మంలోనే కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు.. వారిని హ‌త్య చేసిన నిందితుల కోసం గాలింపు చేప‌ట్టారు.

ద‌ర్యాప్తులు ఇద్ద‌రు అక్కాచెల్లెళ్ల‌పై అత్యాచారం చేసి.. ప్రాణాలు తీసిన‌ట్టు గుర్తించారు. ఈ దారుణానికి ఒడిక‌ట్టిన ఆరుగురిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఇద్దరు దళిత సోదరీమణులపై అత్యాచారం చేసి హత్య ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో నిందితుల్లో ఒకరు పారిపోవ‌డానికి ప్ర‌య‌త్నం చేయ‌గా పోలీసులు కాల్పులు జ‌రిపారు. నిందితులను చోటూ, జునైద్, సుహైల్, కరీముద్దీన్, ఆరీఫ్, హఫీజ్ ఉర్ రెహ్మాన్‌లుగా గుర్తించారు. పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్ తర్వాత జునైద్‌ను అరెస్టు చేశామని, అందులో అతని కాలుపై కాల్చినట్లు పోలీసులు తెలిపారు.

ఇండియా టుడే నివేదిక‌ల ప్రకారం.. లఖింపూర్ పోలీసు సూపరింటెండెంట్ సంజీవ్ సుమన్ మాట్లాడుతూ.. చోటూ మినహా మిగతా నిందితులందరూ లఖింపూర్ ఖేరీలోని లాల్‌పూర్ గ్రామానికి చెందినవారని చెప్పారు. బాలికలు కిడ్నాప్‌కు గురయ్యారని బాధిత కుటుంబీకుల వాదనకు భిన్నంగా బాలికలు తమ స్వేచ్ఛాతోనే నిందితులతో వెళ్లారని ఎస్పీ సంజీవ్ సుమన్ తెలిపారు. బాలికల పొరుగువాడైన చోటూ ఇద్దరు బాలికలను నిందితులకు పరిచయం చేశాడు. అతడిని కూడా అరెస్టు చేశారు.

నిందితులందరిపై ఐపీసీ సెక్షన్లు 302, 376, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ముగ్గురు వైద్యులతో కూడిన ప్యానెల్ బాధితులకు పోస్ట్‌మార్టం నిర్వహిస్తుందని, ఈ ప్రక్రియను వీడియోగ్రఫీ కూడా చేస్తామని ఎస్పీ చెప్పారు.

Related Post