దర్వాజ-శ్రీనగర్
Srinagar encounter: జమ్మూకాశ్మీర్ లో టెర్రరిస్టులు ఉన్నారనే పక్కాసమాచారంతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న క్రమంలో ఉగ్రవాదులు-భారత భద్రతా బలగాలకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కాశ్మీర్ పోలీసులు, భారత సైన్యం-ఉగ్రవాదులకు మధ్య శ్రీనగర్ జిల్లాలోని నౌగామ్ ప్రాంతంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతన్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
గురువారం తెల్లవారుజామున హతమైన ఇద్దరు ఉగ్రవాదులు అగుహ్ ఉగ్రవాద సంస్థతో సంబంధం కలిగి ఉన్నారని పోలీసులు తెలిపారు. AGuH అంటే అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ ఒక ఉగ్రవాద సంస్థ. ఇది అల్ ఖైదాతో సంబంధాలు కలిగి ఉంది. ఈ గ్రూప్ లోయలో చురుకుగా ఉన్నట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇద్దరు ఉగ్రవాదులను పుల్వామాకు చెందిన ఐజాజ్ రసూల్ నాజర్, షాహిద్ అహ్మద్గా గుర్తించారు.
On a specific input generated by Police, an #encounter has started in Nowgam area of #Srinagar District. Srinagar Police and 50RR are on the job. Further details shall follow.@JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) September 14, 2022