దర్వాజ-బెంగళూరు
Karnataka: పొంగిపొర్లుతున్న ఒక వాగును దాటుతుండగా నలుగురు మహిళలు నీటిలో మునిగి చనిపోయారు. ఈ విషాదకర ఘటన కర్నాటకలోని కొప్పల్ జిల్లాలో చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం మహిళలు తమ పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా యల్బుర్గాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళలు నిత్యం రాకపోకలు సాగించే మార్గం కావడంతో డ్రెయిన్లో పడిపోతామని ఊహించలేదన్నారు. అయితే, నీటి ప్రవాహాం తీవ్రత ఎక్కువగా ఉండటంతో నీటిలో కొట్టుకుపోయారని ఇండియా టుడే నివేదించింది. ఆదివారం ఉదయం మూడు మృతదేహాలను వెలికితీశారు. మరో మృతదేహం కోసం రెస్క్యూ టీం గాలిస్తోంది. మృతులను భువనేశ్వరి పాటిల్, గిరిజా పాటిల్, వీణా పాటిల్, పవిత్ర పాటిల్లుగా గుర్తించారు. భువనేశ్వరి, గిరిజా పాటిల్, వీణా పాటిల్ మృతదేహాలు లభ్యమయ్యాయి.
కాగా, గల్లంతైన అస్సాం రాష్ట్ర సివిల్ సర్వీస్ అధికారి సంజు దాస్ సెప్టెంబర్ 29న బ్రహ్మపుత్ర నదిలో మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ ఆదివారం కనుగొంది. పడవ బోల్తా పడటంతో ఏడుగురు వ్యక్తులు నదిలో మునిగిపోయారు. అయితే ఆరుగురిని విజయవంతంగా రక్షించారు. పశ్చిమ అస్సాంలోని ధుబ్రిలో సర్కిల్ ఆఫీసర్ (CO)గా పోస్టింగ్ పొందిన దాస్ అప్పటి నుండి కనిపించకుండా పోయాడు. బ్రహ్మపుత్ర నది మధ్యలో తనిఖీల నిమిత్తం వెళుతున్న పడవ బోల్తా పడటంతో దాస్ నీటిలో మునిగి చనిపోయాడు.