దర్వాజ-కోల్ కతా
Trinamool Congress: ఉద్ధవ్ థాక్రే వర్గానికి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అండగా నిలిచింది. ఆ పార్టీ నాయకుడు డెరెక్ ఓబ్రెయిన్ ఉద్ధవ్ థాక్రేకు మద్దతుగా నిలిచారు. ద్రోహి ఎప్పుడూ ఓడిపోతాడని, నిజమే గెలుస్తుందని అన్నారు. శివసేన శ్రేణులు బలంగా ఉండాలని పేర్కొన్న ఆయన దేశ ద్రోహులు ఎప్పుడూ ఓడిపోతారు. సత్యం ఎప్పటికీ గెలుస్తుంది అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
Stay strong @ShivSena
— Derek O'Brien | ডেরেক ও'ব্রায়েন (@derekobrienmp) October 8, 2022
Traitors always lose.
TRUTH WILL ALWAYS WIN
కాగా, శివసేన రెబల్ నాయకుడు ఏక్నాథ్ షిండే ఆ పార్టీని రెండుగా చీల్చి బీజేపీతో కలిసి మహారాష్ట్ర లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఆసలైన శివసేన నాయకులం తామంటే తామే అంటూ ఉద్ధవ్ థాక్రే, ఏక్నాథ్ షిండే వర్గాలు పేర్కొంటున్నాయి. ఉద్ధవ్ థాక్రే , ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని వర్గాల మధ్య వాగ్వాదం నేపథ్యంలో శనివారం ఎన్నికల సంఘం శివసేన విల్లు, బాణం గుర్తును స్తంభింపజేసింది. ఎవరికి కేటాయించకుండా ఉంచింది. దీంతో ఇరువురు నేతలు గుర్తుల కసరత్తు చేస్తున్నారని సమాచారం.