దర్వాజ-సిద్దిపేట
నంగునూరు మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో శనివారం విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. అంతముందుకు పాఠశాలలు జరిగిన విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో పాఠశాల అభివృద్ధికై పలు తీర్మానాలు చేశారు. విద్యార్థులను పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరయ్యే విధంగా తల్లిదండ్రులు చొరవ చూపాలని ప్రధానోపాధ్యాయులు ఎ మనీష్ కుమార్ కోరారు. సమ్మేటివ్ అసెస్మెంట్ 1 పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులను అందుకు సన్నద్ధం చేసే బాధ్యత ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులపై కూడా ఉందన్నారు.
కాగా, ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తహసిన్ సుల్తానా ,శనిగరం కనకయ్య, కోల శ్రీనివాస్, పత్రి మల్లేశం, ఎం రామకృష్ణ, జీ.వెంకటేశం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు