దర్వాజ-హైదరాబాద్
Munugodu bypoll: మునుగోడు ఉప ఎన్నిక వేళ భారతీయ జనతా పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతుల ఆ పార్టీకి గుడ్ బై చెప్పగా మరో నాయకుడు కూడా కాషాయ పార్టీని వీడారు. తెలంగాణ శాసన మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, సీనియర్ రాజకీయ నాయకులు దాసోజు శ్రావణ్ లు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పార్టీలో చేరారు.
Former Telangana Legislative Council Chairman Sri Swamy Goud and Dr @sravandasoju joined the Telangana Rashtra Samithi (TRS) party in the presence of TRS Working President, Minister Sri @KTRTRS. pic.twitter.com/oJ1BBWQ6l1
— TRS Party (@trspartyonline) October 21, 2022
అలాగే, మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ శుక్రవారం కాషాయ పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) లో చేరారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) ఆయనకు కండువా కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. గౌడ్ గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న సంగతి తెలిసిందే. అతను మార్చి 2019లో టిఆర్ఎస్తో కూడా పనిచేశాడు. ఏప్రిల్ 2022లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ కుమార్ సమక్షంలో భిక్షమయ్య గౌడ్ బీజేపీలోకి మారారు.
BJP Leader Budida Bikshamaiah Goud Joining Program Live from Telangana Bhavan https://t.co/gT5wI7CPmr
— TRS Party (@trspartyonline) October 20, 2022
సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో గౌడ్ను కేటీఆర్ టీఆర్ఎస్లోకి స్వాగతిస్తున్నట్లు కనిపిస్తోంది.
అంతకుముందు ఆయన.. బీజేపీకి తన రాజీనామా లేఖను పంపుతూ.. పలు విమర్శలు చేశారు.
బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా బడుగు, బలహీనవర్గాలకు చేస్తున్న తీవ్ర అన్యాయాన్ని, వివక్షను చూశాక ఆ పార్టీలో కొనసాగడంలో ఏ మాత్రం అర్థం లేదు. రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీలో నన్ను కొనసాగకుండా చేశాయి.
— TRS Party (@trspartyonline) October 21, 2022
– బూడిద బిక్షమయ్య గౌడ్ pic.twitter.com/Od3S5Gp46b
కీలకమైన మునుగోడు ఉప ఎన్నికకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్న తరుణంలో ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం.