దర్వాజ-న్యూఢిల్లీ
దేశవ్యాప్తంగా వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. వాట్సాప్ పనిచేయకపోవడంతో యూజర్లు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి ట్విట్టర్ లో ట్విట్లు చేస్తున్నారు. రియల్టైమ్ మానిటర్ డౌన్డెటెక్టర్ ప్రకారం.. సుమారు 7:50 GMT (12:20pm IST) నాటికి, భారతదేశంలో 11,000 కంటే ఎక్కువ మంది వినియోగదారులు అంతరాయాన్ని నివేదించారు. ఆ తర్వాత యూకే, సింగపూర్ నుంచి వరుసగా 68,000 మరియు 19,000 మంది వినియోగదారులు వాట్సాప్ పనిచేయకపోవడం గురించి నివేదించారు.
ఆ తర్వాత భారత దేశంలో వాట్సాప్ సేవలకు అంతరాయం కలిగిందని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా, మెటా యాజమాన్యంలోని WhatsApp సేవలు ప్రస్తుతం అంతరాయాన్ని ఎదుర్కొంటున్నాయి. సమస్యను అంగీకరిస్తూ.. మెటా ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. సాధ్యమైనంత త్వరగా సేవలను పునరుద్ధరించడానికి కంపెనీ కృషి చేస్తోందని తెలిపినట్టు హిందుస్తాన్ టైమ్స్ నివేదించింది.
“ప్రస్తుతం కొంతమందికి సందేశాలు పంపడంలో సమస్య ఉందని మాకు తెలుసు. వీలైనంత త్వరగా అందరికీ WhatsAppని పునరుద్ధరించడానికి మేము కృషి చేస్తున్నాము” అని తెలిపారు. కాగా, మధ్యాహ్నం 2.25 గంటలకు భారత్ లో తిరిగి వాట్సాప్ సేవలు అంతరాయం లేకుండా పనిచేయడం ప్రారంభించాయి. ఇంకా కొద్ది మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు సమాచారం.