Breaking
Mon. Jun 30th, 2025

రాజ‌న్న సిరిసిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్ద‌రు మృతి

రోడ్డు ప్ర‌మాదం, ఓఆర్ఆర్, హైద‌రాబాద్, ఇద్ద‌రు మృతి, తెలంగాణ‌, నెహ్రూ ఔటర్‌ రింగ్‌ రోడ్డు , Road accident, ORR, Hyderabad, two killed, Telangana, Nehru Outer Ring Road,

ద‌ర్వాజ‌-రాజ‌న్న సిరిసిల్ల

Rajanna-Sircilla: రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు ఈ ప్ర‌మాదంపై విచార‌ణ జ‌రుపుతున్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. బోయిన్‌పల్లి మండలం కొదురుపాక వద్ద గురువారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఎదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులు బోయిన్‌పల్లి మండలం వర్దవెల్లికి చెందిన గాదావరి చందు (28), కోనరావుపేట మండలం సుద్దాలకు చెందిన గట్టు నిఖిల్ (22)గా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టెంట్‌ హౌస్‌ ఉన్న చందు తన స్నేహితుడు వల్లంపట్ల నరేష్‌తో కలిసి కరీంనగర్‌లో పని ముగించుకుని స్వగ్రామానికి వస్తున్నారు. ఇంతలో నిఖిల్ కరీంనగర్ వైపు వెళ్తున్నాడు. కొదురుపాక సమీపంలో రెండు బైక్‌లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. చందు అక్కడికక్కడే మృతి చెందగా, నిఖిల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో తుది శ్వాస విడిచాడు. నరేష్ కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Related Post