Breaking
Tue. Jul 1st, 2025

అమిత్ షాతో భేటీ.. మ‌ర్రి శశిధర్ రెడ్డిపై వేటువేసిన తెలంగాణ కాంగ్రెస్

కాంగ్రెస్, తెలంగాణ‌, మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి, రేవంత్ రెడ్డి, హైద‌రాబాద్, అమిత్ షా, Congress, Telangana, Marri Sasidhar Reddy, Revanth Reddy, Hyderabad, Amit Shah,

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్

Hyderabad: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు కాంగ్రెస్ సీనియర్ నేత మ‌ర్రి శశిధర్ రెడ్డిని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ శనివారం ఆరేళ్ల పాటు బహిష్కరించింది. దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాతో శశిధర్ రెడ్డి భేటీ అయిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఆయన వెంట తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్, ఆ పార్టీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కూడా ఉన్నార‌ని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.

పార్టీ వర్గాల ప్రకారం, శశిధర్ రెడ్డి రాష్ట్ర పార్టీ నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఏ. రేవంత్ రెడ్డి సీనియర్ నాయకుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆయన ఇటీవ‌ల వాపోయారు. రేవంత్ రెడ్డి తీరును త‌ప్పుబ‌ట్టారు. ఈ క్ర‌మంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ శుక్రవారం బీజేపీలో చేరాలనే ప్రతిపాదనతో ఆయనతో సమావేశమైన నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు.

Related Post