దర్వాజ-హైదరాబాద్
Road Accident: కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకెళ్తే.. మానకొండూరు మండలం సదాశివపల్లి స్టేజీ వద్ద బుధవారం తెల్లవారుజామున కారు ఆగి ఉన్న రెండు లారీలను ఢీకొట్టింది.
రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీలను కారు ఢీకొనడంతో వంశీధర్ రెడ్డి (44) అక్కడికక్కడే మృతి చెందాడు. కరీంనగర్ నుంచి వరంగల్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.