Breaking
Sat. Jun 28th, 2025

శ్రీ వేంకటేశ్వర స్వామికి బంగారు కిరీటాన్ని సమర్పించిన మంత్రి హరీష్ రావు

తెలంగాణ, హరీశ్ రావు, సిద్దపేట, బంగారు కిరీటం, వైకుంఠ ఏకాదశి, Telangana, Harish Rao, Siddapet, Bangaru Keeritam, Vaikuntha Ekadashi,

దర్వాజ-సిద్దిపేట

Finance Minister T Harish Rao: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేటలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం ఉదయం 1.792 కిలోల బంగారు కిరీటాన్ని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు బహూకరించారు.

కోటి రూపాయలకు పైగా విలువ చేసే ఈ కిరీటాన్ని ఆలయ యాజమాన్యం కొనుగోలు చేసిన కిలో బంగారంతో తయారు చేయగా, మిగిలిన మొత్తాన్ని హరీష్ రావుతో సహా దాతలు విరాళంగా ఇచ్చారు. ఈ క్రమంలోనే మంత్రి శ్రీ వేంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకునీ, ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ముక్కొటి వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రార్థనలు చేయడానికి ప్రసిద్ధ ఆలయానికి చేరుకోవడంతో ఈ ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది.

T-Harish-Rao-1024x576 శ్రీ వేంకటేశ్వర స్వామికి బంగారు కిరీటాన్ని సమర్పించిన మంత్రి హరీష్ రావు

Related Post