దర్వాజ-న్యూఢిల్లీ
PM Modi: భారత రక్షణ రంగ ఎగుమతులు శుక్రవారంతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రూ.15,920 కోట్లకు చేరుకున్నాయని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఇదే విషయంపై ప్రదాని మోడీ స్పందిస్తూ.. రక్షణ రంగ సంస్కరణలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు.
రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ట్విట్టర్ వేదికగా రక్షణ రంగ ఎగుమతుల గురించి ప్రస్తావించారు. భారత రక్షణ రంగ ఎగుమతులు శుక్రవారంతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కొత్త రికార్డులు నమోదు చేశాయని తెలిపారు. రక్షణ రంగ ఎగుమతులు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి రూ.15,920 కోట్లకు చేరుకున్నాయని తెలిపారు. ఇది భారత్ కు చెప్పుకోదగ్గ విజయమని వివరించారు.
రాజ్ నాథ్ సింగ్ చేసిన ట్వీట్ పై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. రక్షణ రంగంలో తీసుకువచ్చిన సంస్కరణలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు. “అద్భుతం…మేక్ ఇన్ ఇండియా పట్ల భారతదేశ ప్రతిభకు, ఉత్సాహానికి నిదర్శనమిది. గత కొన్నేళ్లుగా రక్షణ రంగంలో తీసుకువచ్చిన సంస్కరణల ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. దేశాన్ని డిఫెన్స్ ప్రొడక్షన్ హబ్ గా మార్చే ప్రయత్నాలను ప్రభుత్వం మరింత ముందుకు తీసుకెళ్తుందని” పేర్కొన్నారు.
Read More…
గుడ్ న్యూస్.. తగ్గిన కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు
అవినీతి సర్కారు.. బీఆర్ఎస్ పై జేపీ నడ్డా తీవ్ర విమర్శలు
చెన్నై సూపర్ కింగ్స్ పై గుజరాత్ టైటాన్స్ గ్రాండ్ విక్టరీ
IPL 2023: అద్దిరిపోయేలా ఐపీఎల్ ఒపెనింగ్ సెరమనీ.. అర్జిత్ సింగ్ తన పాటలతో మైమరపించేశారు.. !
కర్నాటక ఎన్నికలు.. బరిలో నిలిచే ఆప్ అభ్యర్థుల రెండో జాబితా ఇదే..
జైలు నుంచి విడుదల కానునున్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ