మైనంపల్లిపై బీఆర్ఎస్ శ్రేణులు ఫైర్.. దిష్టిబొమ్మ దగ్ధం
దర్వాజ-సిద్దిపేట
Siddipet: మంత్రి హరీశ్ రావుపై బీఆర్ఎస్ నేత మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే సిద్దిపేటలో మైనపల్లిపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆయన దిష్టిబొమ్మను తగులబెట్టారు.
వివరాల్లోకెళ్తే.. ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు తన కుటుంబీకులని నిరంతరం ప్రజల గురించి ఆలోచించే రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు పై మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు విమర్శలు చేయడం సరికాదని బీఆర్ఎస్ కౌన్సిలర్లు సద్ది నాగరాజు రెడ్డి, కెమ్మసారం ప్రవీణ్ కుమార్, సాయన్నగారి సుందర్ లు మండిపడ్డారు. మంత్రి హరీష్ రావు పై మైనంపల్లి హనుమంతరావు చేసిన విమర్శలకు నిరసనగా సోమవారం గణేష్ నగర్ లో మైనంపల్లి దిష్టిబొమ్మను దగ్ధం చేసి మాట్లాడారు. స్వంత పార్టీలో ఉంటూ విమర్శలు చేయడం సిగ్గుచేటు అని అన్నారు.
మెదక్ ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు మైనాంపల్లి ఏం అభివృద్ధి చేశాడు అని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసే నైజం ఆయనది. ప్రజలు నిన్ను రాజకీయంగా భోంద పెడుతారు. దమ్ముంటే సిద్దిపేట కు వచ్చి చూడు.. మేమెందో చూపిస్తాం. తెలంగాణ కోసం పదవులను కూడ పక్కన పెట్టిన చరిత్ర హరీశ్ రావుది. కాంగ్రెస్, బీజేపీతో కుమ్మక్కు అయ్యి హరీశ్ రావు పై విమర్శలు చేస్తున్నాడని మండిపడ్డారు.
మంత్రి హరీష్ రావుకు రాజకీయంగా ప్రజల్లో వస్తున్న ఆధారణను చూసి ఓర్వలేకే విమర్శలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఇక ముందు ఇలాంటి విమర్శలు చేస్తే సహించేది లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పోశం గారి సత్తిరెడ్డి, బొంగు రాజేందర్ రెడ్డి, మాడూరి కిట్టు, లిఖిత్, వీరుగౌడ్,భాస్కర్, మల్లారెడ్డి, శ్రీనివాస్, అశోక్ తదితరులున్నారు.
Share this content: