Telangana Industries and IT minister KTR: దేశంలో రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు (కేటీఆర్) అన్నారు. అభివృద్ధిలో తెలంగాణ మోడల్ దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి పేర్కొన్నారు.
వివరాల్లోకెళ్తే.. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) అన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకునే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అత్యధిక విద్యుత్ లోటు ఉందని ఎత్తిచూపారు.
2013-14లో విద్యుత్ లోటు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు విద్యుత్ మిగులు రాష్ట్రంగా నిలవడమే కాకుండా దేశంలోనే అత్యధిక తలసరి వినియోగంతో దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. తెలంగాణ రైతాంగానికి 24×7 ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. అభివృద్ధిలో తెలంగాణ మోడల్ మిగతా భారతానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
ఇంధన లోటు ఉన్న రాష్ట్రాలు అంటూ..
- డబుల్ ఇంజిన్ శాట్స్ (బీజేపీ పాలిత రాష్ట్రాలు)
- మిగిలినవి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు లేదా దాని సంకీర్ణ భాగస్వామ్య రాష్ట్రాలు
2013-14లో విద్యుత్ లోటు రాష్ట్రంగా ప్రొజెక్ట్ చేయబడిన తెలంగాణ ఇప్పుడు విద్యుత్ మిగులు రాష్ట్రంగా మాత్రమే కాదు.. దేశంలోని రైతులకు ×7 ఉచిత విద్యుత్ ఇస్తున్నఏకైక రాష్ట్రమని తెలిపారు.
ఇదిలావుండగా, ఈ ఏడాది చివర్లలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాకముందే కొత్త పథకాలను అమలు చేసేందుకు బీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డుతోంది. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను 115 స్థానాలకు అధికార పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. పార్టీలో అసమ్మతి మరింత పెరగకుండా చర్యలు తీసుకుంటోంది.