దర్వాజ-హైదరాబాద్
Telangana Group 1 Exam : తెలంగాణలో మరోసారి గ్రూప్-1 పరీక్షలు రద్దయ్యాయి. ఈ మేరకు తెలంగాణ ఉన్నత న్యాయస్థానం గ్రూప్-1 పరీక్షలను రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. మళ్లీ గ్రూప్-1 పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. జూన్ 11వ తేదీన జరిగిన తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
కాగా, ఇదివరకు గ్రూప్ పరీక్ష నిర్వహించి ప్రిలిమినరీ ఫలితాలు సైతం ప్రకటించారు. అయితే, ఇందులో అవకతవకలు గుర్తించి పరీక్షను రద్దు చేశారు. ఆ తర్వాత మళ్లీ గ్రూప్-1 పరీక్షను నిర్వహించారు. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు పరీక్షలను రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో రెండు సార్లు గ్రూప్ – 1 పరీక్షలు రద్దు అయినట్లు అయింది.
అయితే, పరీక్షల రద్దు గురించి హైకోర్టు నిర్ణయంపై ప్రభుత్వం ఏం చేయబోతుందో చూడాలి మరి. టీఎస్ పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ – 1 పరీక్షలో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని పాటించకపోవడంపై పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.హాల్ టికెట్ నెంబర్ లేకుండానే ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని తమ పిటిషన్లలో పేర్కొన్నారు. దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం పరీక్షలను రద్దు చేస్తూ.. మరోసారి నిర్వహించాలని పేర్కొంది.