Breaking
Sat. Jun 28th, 2025

Team India : ఇది ఆరంభం మాత్ర‌మే.. రోహిత్, విరాట్ ల కొత్త టార్గెట్ ఇదే

రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ

దర్వాజ-క్రికెట్

Team India : టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత భారత జ‌ట్టు జోరు కొన‌సాగుతోంది. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా అద్భుత విజయంతో రెండో టీ20 ప్ర‌పంచ క‌ప్ టైటిల్ ను అందుకుంది. భార‌త జ‌ట్టు టీ20 ప్ర‌పంచ క‌ప్ ట్రోఫీ గెలిచిన త‌ర్వాత టీమిండియా ముగ్గురు స్టార్ ప్లేయ‌ర్లు రిటైరయ్యారు. మొట్టమొదట విరాట్ కోహ్లీ టీ20 అంతర్జాతీయ రిటైర్మెంట్ ప్రకటించ‌గా, ఆ త‌ర్వాత రోహిత్ శ‌ర్మ తో పాటు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఈ ఫార్మాట్ కు వీడ్కోలు ప‌లికాడు.

బీసీసీఐ సెక్రటరీ జైషా కొత్త టార్గెట్..

టీమ్ ఇండియా టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఇప్పుడు వచ్చే ఏడాది రెండు పెద్ద ఐసీసీ ఈవెంట్‌లను గెలుచుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సన్నాహాలు చేస్తోంది. టీ20 ప్రపంచకప్ తర్వాత రిటైర్మెంట్ తీసుకున్న ఆటగాళ్లు ఇప్పుడు 2025లో జరగనున్న రెండు పెద్ద టోర్నీలను గెలవడానికి సిద్ధమవుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ, ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో విజయం సాధించడమే టీమ్ ఇండియా తదుపరి లక్ష్యమని బీసీసీఐ సెక్రటరీ జైషా తెలిపాడు.

సీనియర్ స్టార్లు త‌ప్ప‌కుండా ఆడ‌తారు..

అనుభవజ్ఞులైన సీనియర్ ఆటగాళ్లతో కూడిన బలమైన జట్టు ప్రాముఖ్యతను ఎత్తిచూపుతూ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్, ఛాంపియన్స్ ట్రోఫీని గెలవాలని జైషా ఉద్ఘాటించారు. “ఈ జట్టు మార్గం, మా లక్ష్యం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడమే. అక్కడ కూడా దాదాపు అదే జట్టు ఆడనుంది. కచ్చితంగా సీనియర్ ఆటగాళ్లు ఉంటారు” అని జైషా పేర్కొన్నారు. గత దశాబ్దంలో భారత జట్టు భారీ ఫైనల్స్‌లో ఓడిపోయిన సంగతి తెలిసిందే.. అయితే గత 12 నెలల్లో రెండు ఐసీసీ ఫైనల్స్‌లో ఓడిపోవడంతో ఆ జట్టు టైటిల్ కరువును ముగించింది.

మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ పై క‌న్నేసిన టీమిండియా

వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో పాకిస్థాన్ గడ్డపై ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించనున్నారు. ఆ తర్వాత, జూన్ 2025లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లండన్‌లోని లార్డ్స్‌లో జరుగుతుంది. 2013లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ విజయం సాధించింది. ఆ తర్వాత 2017లో ఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో టీమిండియా ఓడిపోయింది. ఈ టోర్నీని మళ్లీ గెలవాలని భారత్ కోరుకుంటోంది.

మళ్లీ టెస్ట్ ఛాంపియన్‌గా నిల‌వాల‌ని..

ప్ర‌పంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ గురించి జైషా మాట్లాడుతూ 2021లో న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో భారత్ ఓడిపోయింది. ఆ తర్వాత 2023లో ఆస్ట్రేలియా ఓడిపోయింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో వరుసగా రెండుసార్లు ఓడిపోయిన భారత్ ఇప్పుడు ఈ టోర్నీని ఎలాగైనా గెలవాలని ఉవ్విళ్లూరుతోంది.

Related Post