- తండాలో నూతన పంచాయతీ కార్యాలయం ప్రారంభం
- ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
దర్వాజ-కొత్తూర్
కొత్తూరు మండల పరిధిలో ఉన్మ మల్లాపూర్ తాండలో నూతన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని మంగళవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో ఆయన స్థానిక నేతలతో కలిసి చెట్లు నాటారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని, గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. గ్రామస్తులకు సుపరిపాలన అందించేందుకు నాయకులకు,అధికారులకు పంచాయతీ కార్యాలయం ఎంతో దోహద పడుతుందని తెలిపారు.

ఎంపీపీ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన రూ. 20లక్షలతో గ్రామపంచాయతీ భవనం ను నిర్మించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అరుంధతి, జడ్పిటిసి శ్రీలత, మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరినాథ్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మజీ సర్పంచ్ అంబటి ప్రభాకర్, మల్లాపూర్ తాండ మాజీ సర్పంచ్ రవి నాయక్,మాజీ ఉప సర్పంచ్ దయానంద్ గుప్తా,దశరథ్ నాయక్,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందూరి శ్రీనివాస్, వీరమొని దేవేందర్ ముదిరాజ్, మంకాల శ్రీశైలం,కర్రోళ్ల సురేందర్,గోవింద నాయక్,బోకుల రాజు, శ్రీరాములు,మల్లేష్,గ్రామ ప్రత్యేక అధికారి రవీందర్ రెడ్డి, మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.