దర్వాజ- ఖమ్మం
మహాశివరాత్రిని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా చింతకాని మండలం నేరేడ గ్రామంలో ఈ నెల(మార్చి) 11 నుంచి 13 వరకు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీలను నేతాజీ యువజన సంఘం సభ్యులు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా రూ. 35వేలు, రెండో బహుమతిగా రూ. 25వేలు, మూడో బహుమతిగా రూ. 20వేలు, నాలుగో బహుమతిగా రూ 15వేలు, ఐదో బహుమతిగా రూ. 10వేలు, ఆరో బహుమతిగా రూ. 8 వేల నగదును అందించనున్నారు.

ఈ నగదు బహుమతులే కాకుండా వీటితో పాటు షీల్డ్ లను కూడా అందించనున్నట్లు నిర్వహకులు తెలిపారు. అలాగే బెస్ట్ రైడర్, బెస్ట్ డిపెండెర్లకు ప్రత్యేక బహుమతులు ఇవ్వనున్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు 7093900119, 9700643222, 9393830093, 7396464878 నెంబర్లను సంప్రదించాలని నిర్వహకులు కోరారు. ఈ కబడ్డీతో పాటుగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఏందే అన్నా.. ఎట్లున్నా కష్టమేనా ?
అవును వాళ్లు ‘గే’నే.. నీకు ఎందుకంత నొప్పి?
మీ చుట్టూ జరుగుతున్న సంఘటనలను మాకు పంపి.. వాటిని ఈ వెబ్ సైట్ లో చూడొచ్చు. మీ ఊర్లో, టౌన్ లో ఏవైనా ముఖ్యమైన ఘటనలు జరిగితే మాకు తెలియజేయండి. మా వాట్సాప్ నెంబర్:7780448771