దర్వాజ-ఏపీ
AP News:సిద్దాంతిని.. మీ ఇంట్లో ఎప్పుడూ గొడవలే.. మీ కొడుకుకి ప్రాణగండం ఉంది.. మీ ఆయనకు ఎవరో చేశారు.. నేనున్నా.. మీకు ఏ అపాయం రాకుండా.. అన్ని గండాల నుంచి మిమ్మల్ని గట్టెక్కిస్తాను. వాటి కోసం పూజలు జరిపిస్తానంటూ.. బిచ్చమెత్తుకునే వాళ్లు మీకిలా ఎప్పుడైనా చెప్పారా..? అయితే బీ కేర్ ఫుల్.. వాళ్లు మీరనుకునే సిద్ధాంతులు అస్సలే కాదు.. మాయమాటలు చెప్పి మిమ్మల్ని నిలువునా ముంచి.. డబ్బులను అప్పనంగా దండుకునే దొంగలు. ఇలాంటి మాయ మాటలు చెప్పే పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలంలో ఓ దొంగ సిద్దాంతి డబ్బులను దండుకుంటున్నాడు.

ఒంటి నిండా బంగారు ఆభరణాలతో ఓ దొంగ మంగళవారం నాడు జిల్లా వెంకటకృష్ణాపురంలోని నివాసం ఉంటున్న చిలుకూరి రాధాకృష్ణ ఇంటికెళ్లాడు. బిచ్చం కావాలని అడగడంతో రాధాకృష్ణ భార్య బియ్యం తీసుకెళ్తే.. ఆ బిచ్చగాడు మాత్రం ఒక చెంచా బియ్యం మాత్రమే తీసుకుని మిగతావి ఇంట్లోకి తీసుకెళ్లమన్నాడు. దీంతో ఆమెకు అనుమానమొచ్చి భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది.. దాంతో ఆ బిచ్చగాడు తనొచ్చిన కారులో పారిపోవాలని ప్రయత్నించాడు..
కానీ అప్పటికే రాధాకృష్ణ వచ్చి ఆ వ్యక్తిని నిలదీయండంతో.. ‘నేను సిద్దాంతిని.. 11 ఇండ్లల్లో ఇలా బియ్యాన్ని తీసుకుని వాటిని షిర్డీలో ఉండే ఆవులకు పెడతానని నోటికి వచ్చింది చెప్పి అక్కడి నుంచి బయటపడ్డాడు. అయితే పోయిన వారం కూడా ఇదే విధంగా తిమ్మాపురంలోని ఓ వ్యక్తి ఇంటికి వెళ్లి.. నీ కొడుకుకి ప్రాణగండం ఉంది.. దాన్ని నుంచి బయటపడాలంటే శాంతి పూజ చెయ్యాలని వాళ్ల నుంచి రూ.16,500 దండుకుని పరారయ్యాడు.
Janhvi Kapoor: అందాల విందుతో రెచ్చిపోతున్న జాన్వీ కపూర్..
Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?
‘నేతాజీ బతికే ఉన్నారా..? లేక మరణించారా.. ఏదో ఒకటి స్పష్టంగా చెప్పిండి’
జస్టిస్ చంద్రు పై ఇప్పుడు గౌరవం పోయింది.. అంటూ చంద్రుపై హైకోర్టు సీరియస్..
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే..?
సమంత ఐటం సాంగ్ పై కేసు పెట్టిన పురుషుల సంఘం.. ఎందుకంటే..?
మిస్ యూనివర్స్ గా భారతీయ యువతి
బిగ్ బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ కంటెస్టెంటేనా..?
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా..? అయితే ఇలా చేయండి..