Loading Now
akhanda

‘అసలు మీరు మనిషేనా’ అని బాలయ్యను అడిగేసిన ప్రగ్యా

దర్వాజ-సినిమా
Akhanda_ Pragya jaiswal : కంచె సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేసి అందరికీ చేరువైంది ప్రగ్య జైస్వాల్. ఆ తర్వాత వచ్చిన జయ జానకి నాయక తదితర సినిమాల్లో నటించి ప్రేక్షకుల్లో మంచి ఇంప్రెషన్ కొట్టేసింది. అందం, అభినయంతో ఆకట్టుకునే ఈ బ్యూటీకి నందమూరి నటసింహం సరసన నటించే అద్భుత అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘అఖండ’ సినిమాలో ఈ చిన్నదాని పాత్ర చాలా కీలకమైనది. కథంతా తనచుట్టూనే తిరుగుందని ఈ సుందరి చెప్పుకొచ్చింది. ఇందులో ప్రగ్యా ఐఏఎస్ పాత్రలో కనిపించనుంది.

download ‘అసలు మీరు మనిషేనా’ అని బాలయ్యను అడిగేసిన ప్రగ్యా
Pragya jaiswal

ఇక ఈ మూవీ గురించి ప్రగ్యా ఇలా చెప్పుకొచ్చింది. అఖండ మూవీ లాంటి కథ నేనెప్పుడూ విననిది.. చూడనిది. ఈ సినిమా చాలా పవర్ ఫుల్. ఇదివరకెప్పుడూ ఇలాంటి సినిమాలు వచ్చుండవు. ముఖ్యంగా నేను ఈ కథ పూర్తిగా వినకుండానే నా పాత్రకు ఓకే చెప్పాను. అంటే బోయపాటి మీదున్న నమ్మకంతోనే నేను ఈ పాత్రకు ఒప్పుకున్నాను. ఈ మూవీ కోసం ఎంతో శ్రమించాను. దీనికి తగిన ప్రతిఫలం వస్తుందని ఆశిస్తున్నాను.

ఇక నా పాత్ర చుట్టే కథ మొత్తం తిరుగుతుందని చెప్పుకొచ్చింది ప్రగ్యా. ఇక నందమూరి నటసింహం గురించి మాట్లాడుతూ.. బాలయ్య గారు ఉదయం 3 గంటలకే నిద్ర లేస్తారు. 6 గంటల కల్లా సెట్లో ఉంటారు. ఇక ఆయన ఎనర్జీ గురించి చెప్పలేము.. నేనే షాకయ్యాను. ఒకసారి ‘మీరు మనిషేనా’? అని కూడా సరదాకు అడిగేసాను. ఆయనకున్న సినిమాల పట్లున్న ఇష్టం, ఎనర్జీ ల గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ సమయపాలన, క్రమశిక్షణ లో మాత్రం బాలయ్య అస్సలు తగ్గరు. కానీ చాలా పాజిటీవ్ గా మాట్లాడుతారని చెప్పుకొచ్చింది ప్రగ్యా.

పీరియడ్స్ టైం లో తీసుకోవాల్సిన ఫుడ్ ఇదే..!

Adani: అంబానీని వెన‌క్కి నెట్టిన అదానీ

Farm Laws: సాగు చట్టాల రద్దు బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం

ప్చ్.. సమంత చేసిన ఆ పనికి ఫ్యాన్స్ ఫైర్..

Share this content:

You May Have Missed