మీ షుగర్ తో జర పైలంగా ఉండాలే.. అది మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా కానీ.. జీవితాంతం మిమల్ని అది బాధ పెడుతుంది. ఒక్కసారి దాని బారిన పడితే.. దినాం మందులు మింగుతూనే ఉండాల్సి రావొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. డయాబెటిస్ ( మధుమేహ) గా పిలువబడే ఈ రోగం రాకుండా ఉండాలంటే కొన్ని పనులను చేస్తే సరిపోతుంది. కాదూ కూడదూ అంటూ వ్యవహరిస్తే.. జీవితాంతం నరకప్రాయంగ బతకాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ముప్పై యేండ్ల రాకముందే ఎంతో మంది ఈ మహమ్మారి బారిన పడి ఎంతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ రోగం మిగతా దేశాలతో పోల్చి చూస్తే.. మన దేశంలోనే ఎక్కువట. ఈ రోగం బారిన పడటానికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ.. ముఖ్య కారణం మాత్రం మంచి ఆహారపు అలవాట్లు లేకపోవడం, వ్యాయమం చేయకపోవడమేనట. ఈ కారణాల వలన టైప్ 2 డయాబెటిస్ బారిన ఈజీగా పడిపోయే అవకాశం ఉందట.
అందుకే ఈ రోగం రాకుండా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడంతో పాటూ వ్యాయమం చేయాలని చెబుతున్నారు. అలాగే కొన్ని చిట్కాలను పాటిస్తే.. రక్తంలో షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచుకోవచ్చట. అలా చేయకపోతే షుగర్ లెవెల్స్ పూర్తిగా తగ్గి మూర్చపోయే ప్రమాదం కూడా పొంచి ఉందట. అందుకే ఈ రోగంతో బాధ పడేవాళ్లు షుగర్ లెవెల్స్ స్థిరంగా ఉంచుకునేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ప్రపంచంలోని ఎంతో మందిని, ఎంతో కాలంగా వణికిస్తున్న ఈ రోగం వలన చిన్న దెబ్బ తగిలినా చర్మం తట్టుకోలేని స్థితికి తీసుకుపోతుంది. అయితే ఈ రోగం కొందరికి వంశపారపర్యంగా కూడా సోకే అవకాశం ఉన్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. ఏదేమైనా కానీ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచుకుంటే మన ఆరోగ్యానికే మంచిదని పలువురు చెబుతున్నారు.

ఏ ఆహారాన్ని తీసుకోవాలంటే:
ఈ మధుమేహం వ్యాధితో బాధ పడేవాళ్లు సాల్మన్, హెర్రింగ్, ఆంకోవిస్ లాంటి కొవ్వు కలిగిన చేపలను ఎక్కువగా తినాలి. అట్లాగే కేలరీలు తక్కువగా ఉండే ఆకు కూరలు తినాలి. అలా చేయడం వలన షుగర్ లెవెల్స్ ను తగ్గించొచ్చు. అలాగే దాల్చిన చెక్క షుగర్ లెవెల్స్ ను తగ్గించడంలో ఎంతో క్రియాశీలకంగా వ్యవహరిస్తుందట. అలాగే ప్రోటీన్లు పుష్కలంగా ఉండే గుడ్లను ఎక్కువగా తినాలి. ఇది గుండె సంబంధిత వ్యాధుల బారిన పడకుండా కూడా చేస్తుందట.
ఎన్నో ఔషధ లక్షణాలు ఉండే పసుపు కూడా మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇది కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు. పెరుగు కూడా షుగర్ లెవెల్స్ ను తగ్గిచడంలో ఎంతగానో ఉపయోగ పడుతుంది. ముఖ్యంగా తక్కువ మొత్తంలో పిండి పదార్థాలను తీసుకోవాలి. ఇలా పలు ఆరోగ్య చిట్కాలను పాటిస్తే.. షుగర్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచొచ్చట.
ఈ పై విషయాలన్నీ.. కేవలం విషయ పరిజ్ఞానం కోసం మాత్రమే అని మరిచిపోవద్దు. మీకు నిజంగానే షుగర్ వ్యాధి ఉండే.. డాక్టర్ల సలహాలను మాత్రమే పటించాలి. అలాగే వారు చెప్పిన విధంగానే ఆహార నియమాలను పాటించాలి.
కడుపునొప్పి, విరోచనాలు అయితే వెంటనే జాగ్రత్త పడాల్సిందే..!