దర్వాజ-హెల్త్ & బ్యూటీ
నేడు చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య డిప్రెషన్. యువత, నడివయస్కులు అంటూ తేడా లేకుండా చాలా మంది ఈ డిప్రెషన్ తో బాధపడుతున్నారు. ఈ సమస్య ఎక్కువై చాలా ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి. ఓ సర్వే తెలిపిన వివరాల ప్రకారం.. ప్రతి ఐదుగురు వ్యక్తుల్లో ఒకరు ఈ డిప్రెషన్ సమస్యతో బాధపడుతున్నారని తేలింది. ఈ సమస్య వల్ల నిద్రలేమి, బద్దకం, శరీర అలసట వంటి లక్షణాలు ఉంటాయట.
అయితే ఈ డిప్రెషన్ నుంచి బయటపడటానికి కౌన్సిలింగ్, మెడికేషన్ వంటివి సహజంగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ మెడికేషన్, కౌన్సిలింగ్ ద్వారా 30 శాతం మంది మాత్రమే క్యూర్ అవుతున్నారని సర్వే చెబుతోంది. కానీ ఎన్ని మెడికేషన్స్ తీసుకుంటున్నా.. డిప్రెషన్ నుంచి బయటపడని వారు ఇంకో ముప్పై శాతం మంది ఉన్నారట. ఈ 30 శాతం మంది మాత్రం మెడికేషన్స్ తీసుకున్నా నెలలకు నెలలు ఒత్తిడి, డిప్రెషన్ లోనే ఉంటున్నారని తేలింది.
ఇలాంటి వారికోసమే నిపుణులు అద్భుతమైన చిట్కాలను తెలియజేశారు. ఈ చిట్కాతో నెలల తరబడి డిప్రెషన్ లో మగ్గుతున్న వారు ఈజీగా బయటపడొచ్చని సూచిస్తున్నారు. అదేంటంటే.. డిప్రెషన్ తో బాధపడుతున్న వారు ప్రతి రోజూ వేడి నీటితో స్నానం చేసినట్టైతే డిప్రెషన్, ఒత్తిడి వంటి సమస్యల నుంచి ఈజీగా బయటపడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే తాజా ఫ్రూట్స్ ను, కూరగాయలను తీసుకోవడం వల్ల కూడా ఒత్తిడి తగ్గొచట. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా.. రోజుకు 400 గ్రాముల పండ్లు, తాజా కూరగాయలు తినమని ప్రజలకు తెలియజేస్తోంది.
సైదాబాద్ ఘటన రాజు మరణంపై అనుమానలొద్దు: డీజీపీ మహేందర్ రెడ్డి
సింగరేణి కాలనీ ఘటన నిందితుడు ఆత్మహత్య
మోడీ పుట్టిన రోజునే ‘నిరుద్యోగ దినోత్సవం’
గుజారత్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధిక క్రైమ్ రేటు
తెలుగు రాష్ట్రాల్లో గలీజు రాజకీయాలు